Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్యాన్ పోగొడుతుంది : ఎండ వల్ల చర్మంపై నల్లమచ్చలు ఏర్పడతాయి. చాలామంది దీని నుంచి విముక్తి పొందేందుకు మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు వాడుతుంటారు. అయితే ఈ మచ్చలను పసుపు పోగొడుతుంది. దాని కోసం పసుపు, చందనం, నిమ్మరసం తగు పాళ్లలో కలిపి చర్మానికి ప్యాక్లా వేసుకుని శుభ్రం చేసుకుంటే చాలు.
అవాంఛిత రోమాలను తగ్గిస్తుంది : పసుపుతో ముఖ వర్చస్సు పెరగడమే కాకుండా ముఖంపై రోమాలు పెరగకుండా ఉంటాయి. మీరు కూడా ముఖంపై అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతుంటే పసుపులో కొద్దిగా రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకొని కాసేపాగిన తర్వాత శుభ్రం చేసు కోవాలి. ఈ ప్యాక్ వారానికి ఒకసారి వేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ : వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు, గీతలు ఏర్పడటం సహజం. వీటిని తగ్గించుకోవడం కోసం పచ్చిపాలల్లో బియ్యప్పిండి, కొద్దిగా పసుపు కలిపి మిశ్రమంగా చేసి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. అరగంట తర్వాత దీనిని శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ ప్యాక్ మీ చర్మాన్ని తిరిగి యవ్వనంగా మారుస్తుంది.
మొటిమలు మాయం : పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. పసుపులో తగినన్ని నీళ్లు వేసి ముద్దగా చేసి ముఖానికి రాసుకొని పావుగంట తర్వాత కడిగేయాలి. ఇలా కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి.
మదువైన చర్మం కొరకు : శెనగ పిండిలో కొద్దిగా పసుపు కలిపి స్నానానికి ముందు చర్మానికి నలుగు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మతకణాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా వారానికోసారి చేయడం వల్ల మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.
మచ్చలు తగ్గిస్తుంది : చర్మంపై మొటిమలు, గాయాల వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గడానికి క్రమం తప్పకుండా మచ్చలపై పసుపు అప్లై చేస్తూ ఉంటే.. కొన్ని రోజుల తర్వాత అవి చర్మం రంగులోకి మారిపోతాయి.
జిడ్డుగా మారకుండా : కొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా చర్మం చాలా జిడ్డుగా తయారవుతుంటుంది. దీనికి కారణం చర్మ గ్రంథుల నుంచి అధికంగా విడుదలయ్యే సీబమ్. దీనివల్ల చర్మం మెరుపుని కోల్పోతుంది. దీనికోసం గంధం, పసుపుని కమలాఫల రసంలో కలిపి ముద్దగా చేసి ముఖానికి మాస్క్లా అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.