Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిత్యం కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసే వాళ్లకు కంటి సమస్యలు రావడం ఇప్పుడు ఎక్కువవుతున్నది. ఈ వ్యాధిని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పిలుస్తున్నారు. దీని బారిన పడకుండా ఉండాలంటే కంటి వైద్య నిపుణులు చెబుతున్న చిట్కాలు..
- కంప్యూటర్, ల్యాప్ టాప్ తెరను అదేపనిగా చూడకూడదు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కండ్లను మూయాలి. 20 సెకండ్ల పాటు అలాగే మూసి ఉంచి.. తెరిచిన తర్వాత 20 ఫీట్ల దూరంలో ఉన్న దానిని చూడాలి.
- మానిటర్ల లైటింగ్ను తగ్గించుకోండి..మీ కంప్యూటర్ స్క్రీన్ తెర లైటింగ్ను తగ్గించుకోండి. అలాగే అందులో ఉండే కలర్ల కాంతిని కూడా ఆప్టిమైజ్ చేసుకోండి. ఒకవేళ రాత్రిళ్లు పనిచేసేవారైతే దానిని నైట్ మోడ్లో పెట్టుకోవడం ఉత్తమం.
- మీరు తరుచూ కంప్యూటర్ తెరను చూస్తున్నప్పుడు తరుచూ రెప్ప వేస్తూ (ఐస్ బ్లింకింగ్) ఉండాలి. మరీ ఇది ఎక్కువగా లైటింగ్ పెట్టుకున్నప్పుడైతే ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాలి.ఎందుకంటే ఎక్కువ కాంతిని మన కండ్లు చూసినపుడు.. కండ్లు త్వరగా పొడిబారడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. కండ్లు అధిక లైటింగ్ను ఎక్కువ సేపు చూడలేవు. అందుకే తరుచూ రెప్పను బ్లింక్ చేస్తూనే ఉండాలి.
- కంప్యూటర్ మీద పనిచేసేవాళ్లు దానిని కుడివైపున ఎక్కువసేపు చూసేలా అమర్చు కోవాలి. అంతేగాక కండ్లకు.. కంప్యూటర్ స్క్రీన్ తెరకు 22-28 అంగుళాల దూరం ఉండాలి. వీటితో పాటు కంప్యూటర్ తెర ఐ లెవల్కు 10 నుంచి 15 డిగ్రీల కింద ఉండాలి.
- కంప్యూటర్లను తరుచూ వాడేవారు తప్పనిసరిగా కళ్లద్దాలు పెట్టుకోవాలి. వైద్యులను సంప్రదిస్తూ.. నిత్యం ఐ సైట్ చెక్ చేసుకుంటూ.. కండ్లలో ఏదైనా సమస్య ఏర్పడినపుడు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి సంవత్సరానికి ఒకసారైనా కండ్లను చెక్ చేయించుకుని దృష్టి సమస్యలు రాకుండా చూసుకోవడం మంచిదంటున్నారు కంటి వైద్య నిపుణులు..