Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బేకరీ పదార్థాలకు: బ్లడ్ షుగర్ స్థాయిలను అమాంతం పెంచేలా చేసే బేకరీ పదార్థాలకు దూరంగా ఉంటే మనలోని మానసిక ఆందోళనను అదుపు చేయవచ్చు. కేకులు, కుకీలు వంటివాటిలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువ కాబట్టి ఇవి తిన్నవెంటనే బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగి మన మానసిక సమస్యలపై అది మరింత దుష్ప్రభావం చూపేలా చేస్తుంది. అందుకే మనకు ఇష్టమైన పేస్ట్రీలు, కేకులకు బదులు తాజా పళ్లను ఎంచుకోవడం అత్యుత్తమం. పళ్లలోనూ గ్లూకోజ్ ఉంటుంది కానీ అది సహజమైన చక్కెర కనుక ప్రమాదకరం కాదు.
జ్యూసులకు: పళ్లను మనం పూర్తిగా తింటాం. కానీ పండ్ల రసం అంటే అందులోని గుజ్జుతో కూడిన పీచు తీసేసి, రుచి పెరిగేందుకు చక్కెర, చాక్లెట్ సిరప్, ఎసెన్స్ ఇలా అన్నీ రంగరించి తాగే పండ్ల రసాలతో మంచి కంటే హాని ఎక్కువ జరుగుతుంది. చక్కెర ఎక్కువగా వేసిన పళ్ల రసాలతో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువై అది ప్రత్యక్షంగా మన మానసిక అరోగ్యంపై ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. కాబట్టి బ్లడ్ షుగర్ పెంచే ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ పండ్లను తినడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఫైబర్ ఉన్న పండ్లను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే విషయాన్ని మర్చిపోవద్దు.
స్మూతీస్: ఇటీవలి కాలంలో జ్యూసులకంటే స్మూతీలకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. చాలామంది స్మూతీ తాగడం స్టైల్గా భావిస్తున్నారు. అయితే ప్రొటీన్లు, పండ్లు, ఫైబర్ ఇవన్నీ లేని స్మూతీతో ఆరోగ్యం దెబ్బతింటుంది. స్మూతీలతో మనకు ఎక్కువ శక్తి వస్తుందన్నది నిజమే కానీ చక్కెర ఎక్కువ వేసిన స్మూతీలతో మానసిక సమస్య అధికమవుతుంది.
టీ-కాఫీలు తగ్గించండి: కెఫీన్ ఉన్న కాఫీ, టీలు ఎక్కువగా తాగేవారిలో ఒత్తిడి సమస్యలు అత్యధికం. సెంట్రల్ నర్వ్ సిస్టంను ప్రభావితం చేసే కాఫీ, టీలతో యాంక్జైటీ తారాస్థాయికి చేరే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తరచూ కాఫీ, టీల జోలికి వెళ్లకుండా నియంత్రించడం అత్యవసరం.
అధికంగా తినొద్దు: ఒత్తిడి ఉన్నవారు ప్రాసెస్డ్ ఫుడ్ తినడంతో కడుపునొప్పి, అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కేలరీలు అత్యధికంగా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ నోరూరించినా ఇందులో పీచు పదార్థం చాలా తక్కువ కనుక పేగుల్లో సమస్యలు సృష్టిస్తుంది. సాధారణంగా ఒత్తిడితో బాధపడుతున్న వారు ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టపడతారు. అయితే అనారోగ్యం బారిన పడకూడదంటే ఆహారంపై నియంత్రణ ఉండేలా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం.