Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలను రోజ్ వాటర్లో కలిపి చర్మానికి తరచూ అప్లై చేస్తే చర్మం నిగనిగలాడుతుంది.
పాలలో కాసింత ఉప్పు కలిపి ఉదయం-సాయంత్రం ముఖానికి మర్దన చేస్తే మొటిమలు మాయమవుతాయి.
బాదం పప్పులు, బేసన్, క్యారెట్లు కలిపి పాలతో జ్యూస్లా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లనినీటితో కడిగేయాలి.
పాలతో శరీరాన్ని మర్దన చేసి స్నానం చేస్తే చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది.
తరచూ గోళ్లు విరిగిపోయేవాళ్లు వేళ్ళను పాలలో ముంచి కాసేపు ఉంచాలి. దీంతో గోళ్ళు అందంగా, పటిష్టంగా ఉంటాయి.
పెదాల నలుపుదనం పోవాలంటే ప్రతిరోజూ ఉదయం పెదాలకు పాలను అప్లై చేయాలి.
పావుకప్పు పాలల్లో చెంచా తేనె, రెండు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి ఆరనివ్వాలి. ఆపై స్నానం చేస్తే చర్మంపై ఉన్న నలుపుదనం తగ్గిపోతుంది.
మృతకణాలు తొలగి చర్మం మృదువుగా కనిపించాలంటే పావుకప్పు పాలల్లో రెండు చెంచాల శనగపిండి, చిటికెడు పసుపు, చెంచా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి రాసుకొని మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తే చర్మం నునుపుగా మారుతుంది.
పచ్చిగుడ్డు సొన పాలలో కలుపుకొని ఆ మిశ్రమంతో తలంటుకంటే జుట్టు పెరగటమే కాదు. మాడుకు సంబంధించిన చర్మవ్యాధులూ మీ దరి చేరవు.
ముఖం పై పేరుకొన్న జిడ్డు, మురికి తొలగించడానికి పాలు చక్కని పరిష్కారం. పచ్చి పాలల్లో చెంచా తేనె కలిపి దాన్ని ముఖానికి పట్టించి సహజంగా ఆరనివ్వాలి. ఇలా రోజూ చేస్తుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.
పొడిచర్మం ఉన్నవారు గుడ్డులోని తెల్ల సొనకు ఒక టీస్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖం, మెడ, చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తరువాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
రెండు టీస్పూన్ ల శెనగపిండిలో ఒక టీస్పూన్ పాలు, పావు టీస్పూన్ తేనె కలిపి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత చల్లని నీళ్లతో కడిగి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా చేస్తే పొడి చర్మానికి తేమ అందుతుంది.
నిద్రలేమితో బాధపడే వాళ్ళు రోజూ రాత్ర పడుకోబోయే ముందు గ్లాసెడు పాలలో తేనెను కడుపుకుని తాగాలి.
గ్లాసెడు మరగ కాచిన పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని రోజూ రాత్రిపూట తాగితే శ్వాసకోశ సంబంధ ఇబ్బందులనుంచి విముక్తి లభిస్తుంది.