Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాతృదేవోభవ ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతిఒక్కరి కంటచెమ్మా తెప్పించిన నటి మాధవి. సినీపరిశ్రమలో కొద్దిరోజులే ఉన్నా మరిచిపోలేని చిత్రాలతో ప్రేక్షకుల అభినందనలు అందుకున్న నటి ఆమె. దక్షిణాదిలోని నాలుగు ప్రముఖ భాషలు తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషా చిత్రాలతో పాటు అనేక హిందీ భాషా చిత్రాలలో కూడా నటించారు.
హైదరాబాదులో శశిరేఖ, గోవిందస్వామి దంపతులకు మాధవి జన్మించారు. ఆమె చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. మాధవి అసలు పేరు కనక విజయలక్ష్మి. సినీరంగంలోకి వచ్చిన తర్వాత ఆమె పేరును మాధవిగా మార్చారు. చిన్నతనంలోనే నాట్యంపై ఆసక్తి చూపించడంతో తల్లిదండ్రులు ఆమెకు నాట్యగురువు ఉమా మహేశ్వరి వద్ద భరతనాట్యం నేర్పించారు. ప్రముఖ జానపద గురువు భట్ వద్ద జానపద న త్యం నేర్చుకొని వేలాది న త్య ప్రదర్శనలు ఇచ్చారు. అబిడ్స్ లోని స్టాన్లీ బాలికల పాఠశాలలో మాధవి విద్యాభ్యాసం కొనసాగింది. ఎనిమిదో తరగతి చదువుతుండగా రవీంద్రభారతిలో నాట్య ప్రదర్శన ఇస్తున్న కనక విజయలక్ష్మిని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు చూసి తను తీయబోయే సినిమాలో నటించమని కోరారు. ఆమె తల్లిదండ్రుల అనుమతితో సినిమా రంగంలోకి వచ్చారు.ఆమె మొదటి చిత్రం 'తూర్పు పడమర'. ఆ సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. దర్శకుడు కె.బాలచందర్ 1979లో అత్యద్భుత విజయం సాధించిన 'మరో చరిత్ర' సినిమాతో మాధవి చిత్రరంగంలో మంచి గుర్తింపు వచ్చింది. 1981లో అదే సినిమా హిందీలో ''ఏక్ ధూజే కేలియే''గా వచ్చినప్పుడు తిరిగి అదే పాత్రను పోషించారు. హిందీలో కూడా ఈ చిత్రం అఖండ విజయం సాధించింది.
మాధవి తెలుగులో మొదట చిత్రరంగంలోకి వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆమె హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, ఒరియా, బెంగాలీ, మలయాళం భాషలలో నటించారు. ప్రముఖ నటులు శివాజీ గణేషన్, రజినీకాంత్, మమ్ముటీ, మోహన్ లాల్, రాజ్కుమార్, రంజిత్ మాలిక్, కమల్ హాసన్, అంబరీష్, మోహన్బాబు, చిరంజీవి వంటి ప్రసిద్ధ నటులతో నటించారు. 'మాతృదేవోభవ' సినిమాలో తన నటనతో ప్రేక్షకుల కంటకన్నీరు పెట్టించారు.
హరిహన్, కె, విశ్వనాథ్, కె. బాలచందర్, రాఘవేంద్రరావు, పద్మరాజన్, భరతన్, భారతి రాజా, డోరై భగవాన్ వంటి గొప్ప దర్శకుల దర్శకత్వంలో మాధవి నటించారు. అత్యుత్తమ నటిగా తాను నటించిన అన్ని భాషల్లోనూ రాష్ట్ర అవార్డులను గెలుచుకుంది. ఆమె పదిహేడేళ్ల పాటు సినీరంగంలో ఉన్నా మూడు వందల కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు.
1996 వ్యాపారవేత్త శర్మను పెళ్లాడి న్యూజెర్సీలో మాధవి స్థిరపడ్డారు. తన ముగ్గురు పిల్లలను పెంచుతూ భర్తకు వ్యాపారంలో సహాకారం అందిస్తూ సినీరంగానికి దూరంగా ఉన్నారు.