Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అశ్విని పొన్నప్ప ( 18సెప్టెంబరు 1989)
ప్రతిష్టాత్మకమైన ప్రపంచ చాంపియన్ షిప్ లో ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాలతో కలిసి డబుల్స్లో కాంస్య పతకం సాధించిన క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప. బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్ షిప్ ర్యాంకింగ్ లో వీరిద్దరూ నిలకడగా టాప్ 20 స్థానాల్లో నిలవడం విశేషం. అశ్వినీ, జ్వాలా కలసి 2011లో బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్ షిప్స్ లో కాంస్య పతకం సాధించడంతో, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ జంటగా రికార్డు సృష్టించారు. వీరిద్దరూ కలసి కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించారు. వీరి కెరీర్ లో నెం.10 ర్యాంకును సాధించడం మైలు రాయిగా చెప్పుకోవచ్చు.
బెంగళూరులో జన్మించారు అశ్వినీ. ఆమె తండ్రి జాతీయ స్థాయి హాకీ క్రీడాకారుడు. బెంగుళూరులోని సెయింట్ ఫ్రాన్సిస్ గ్జేవియర్స్ గర్ల్స్ హైస్కూల్ లో ప్రాథమిక, మాధ్యమిక విద్య పూర్తి చేశారు. హైదరాబాద్లో డిగ్రీపూర్తి చేశారు. చిన్నతనం నుంచి ఆటలంటే ఎంతో ఆసక్తి చూపించే అశ్వినీ తండ్రి బాటలో హాకీని ఎంచుకోలేదు. తనకు ఎంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ ఎంచుకుని, అందులో సీరియస్ గా ట్రైనింగ్ తీసుకున్నారు.
2004, 2005లో వరుసగా రెండెండ్లు సబ్ జూనియర్స్ గర్ల్స్ డబుల్స్ విభాగంలో మొట్టమొదటి జాతీయ స్థాయి టైటిల్ గెలుచుకున్నారు అశ్వినీ. ఆ తర్వాత 2006, 2007ల్లో జూనియర్ గర్ల్స్ డబుల్స్ జాతీయ స్థాయి టైటిల్ గెలుచుకున్నారు. 2010లో జరిగిన దక్షిణ ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం సాధించారు. అంతేకాదు ఆ ఏడాది జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో మహిళల డబుల్స్ విభాగంలో ఆమె ఆడారు. ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాలాతో కలసి బంగారు పతకం గెలిచి, మొట్టమొదటిసారి బంగారు పతకం గెలుచుకున్న జంటగా చరిత్రలో నిలిచారు. ఈ విజయంతో వారిద్దరి పేర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మారిమోగిపోయాయి.
ప్రస్తుతం సియోల్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఆమె ఆడుతున్నారు.