Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజులో కనీసం మూడు సార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాల్లో దాగి ఉన్న దుమ్ము, ధూళి కణాలు తొలగిపోతాయి. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.
చర్మ సౌందర్యానికి ఉపయోగించే సబ్బులు, స్క్రబ్స్, లోషన్స్, మాయిశ్చరైజర్స్, క్రీములు, కండీషనర్స్ నాన్-ఆల్కహాలిక్ కు సంబంధించినవై ఉండాలి. నాన్-ఆల్కహాలిక్ రసాయనాలున్న సౌందర్య సాధనలను ఉపయోగించడం వల్ల పిహెచ్ లెవల్స్ను సమతుల్యంగా ఉంచుతాయి.
వాతావరణం చల్లగా ఉందని చాలా మంది నీరు తక్కువగా తీసుకుంటారు. ఈ కారణంగా తలనొప్పి వంటి సమస్యలతో పాటు చర్మం, పెదాలు పొడి బారుతాయి. కాబట్టి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తప్పని సరిగా తీసుకోవాలి. సహజంగా చర్మం పొడిబారితే మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది.
జిడ్డు చర్మం ఉన్న మాయిశ్చరైజర్ రాసుకోవడం మంచిది. అయితే వాటర్ బేస్డ్ ఉండే మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తే సరిపోతుంది.
వానలో తడిస్తే కచ్చితంగా తల స్నానం చేయాలి. తలస్నానం చేయకపోతే వెంట్రుకలు దుర్వాసన రావడం, చర్మం జిడ్డుగా మారడం, దురద పెట్టడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ముఖ్యంగా వాన కాలంలో బయటకు వెళ్లే ముందు జ్యువెలరీ పెట్టుకోవద్దు. జ్యువెలరీ ఉన్న ప్రాంతంలో చర్మం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎందుకంటే నీటిలో తడవడం, చమట కారణంగా చికాకు, దురద, మంట, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త వానా కాలంలో జ్యువెలరీకి దూరంగా ఉండటం మంచిది.
- సాధారణంగా ఇంట్లో ఔషధగుణాలున్న పదార్థాలతోనే(పెరుగు, పాలు, పచ్చి కొబ్బరి, పసుపు, తులసి, మెంతులు, పండ్లు) ఫేసు ప్యాక్స్ వేసుకోవడం మంచిది. ఈ పదార్థాలే చర్మానికి సహజమైన సౌందర్యాన్ని చేకూర్చుతాయి.