Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తవనం సుబ్బాయమ్మ
(1934-18 అక్టోబర్ 2014 )
ప్రకాశం జిల్లా ఐద్వా అధ్యక్షురాలిగా రెండుదశాబ్దాల పాలు పనిచేసిన స్ఫూర్తిప్రదాత తవనం సుబ్బాయమ్మ శ్రామిక మహిళల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆమెకు అక్షరజ్ఞానం లేకున్నా మహిళా ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. సారా నిషేధ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉద్యమించి మహిళలందరిని సంఘటితం చేశారు.
కొరిశపాడు మండలం ప్రాసంగులపాడులోని నిరుపేద కుటుంబంలో జన్మించారు సుబ్బాయమ్మ. అదే ఊరికి చెందిన తవనం చెంచయ్యతో పెండ్లి తర్వాత ఆమె భర్తి స్ఫూర్తితో ఉద్యమాల వైపు నడిచారు. నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడిన చెంచయ్య, శాసనసభ్యుడిగాను పనిచేశారు. దాదాపు 75 ఏండ్ల పాటు ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు. భర్త ప్రోత్సాహంతో అనేక ఉద్యమాలను నడిపిన సుబ్బాయమ్మ జిల్లా పార్టీ సభ్యురాలిగా పనిచేశారు. కార్యకర్తగా చేరి1980లో 'ఐద్వా' జిల్లా అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. జిల్లా అధ్యక్షురాలిగా దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆమె బాధ్యతలు నిర్వహించారు.
1993లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగిన సారా ఉద్యమానికి జిల్లాలో ఆమె నాయకత్వం వహించారు. 2014లో భర్త చనిపోయిన తర్వాత ఆమెకు వచ్చే పింఛను మొత్తాన్ని పార్టీకే ఇచ్చారు. పార్టీ, ప్రజా ఉద్యమాలు తప్ప మరో వ్యాపకం లేని సుబ్బాయమ్మ బాగోగులను పార్టీయే చూసినది. 35 ఏండ్లు మహిళా ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిన ఆమె ఎక్కడ మహిళల సమస్యలు ఉంటే అక్కడకు వెళ్ళి పోరాడేవారు. ఎందరో మహిళా ఉద్యమకారులకు ఆమె ఆదర్శంగా నిలిచారు. మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన సుబ్బాయమ్మ 18 అక్టోబర్,2014న మరణించారు. ు