Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుస్మితా సేన్ (19 నవంబరు 1975 )
ఆత్మవిశ్వాసంలోనే కాదు అందాల పోటీల్లోనూ భారతీయ మహిళలు విజేతలుగా నిలుస్తారని నిరూపించిన మహిళ సుస్మితాసేన్. 1994లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో విజేతగా నిలిచి సెనేట్ కిరీటం గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ. మోడల్గా రాణించిన ఆమె హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించారు. చిన్నారులంటే అమితమైన ఇష్టం ఉన్న సుస్మిత 2000 లో ఒక అమ్మాయిని, 2010 లో మరో అమ్మాయిని దత్తత తీసుకుని ఇద్దరు అమ్మాయిలను పెంచుతూ ఆదర్శంగా నిలిచారు.
హైదరాబాదులో జన్మించిన సుస్మితా మాత భాష బెంగాలీ. ఆమె తండ్రి షుబీర్ సేన్ భారత వాయు సేనలో వింగ్ కమాండర్గా పనిచేశాడు. తల్లి శుభ్రా సేన్ నగల డిజైనర్. సికింద్రాబాద్లోని సెయింట్ అన్స్ ఉన్నత పాఠశాలలో, ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇనిస్టిట్యూట్లో ఆమె విద్యాభ్యాసం సాగింది. మోడలింగ్ కెరీర్గా ఎంచుకున్న ఆమె 1994 లో తన18వ యేట ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరిగిన మిస్ ఇండియా పోటీలలో మొదటి స్థానం గెలుచుకొన్నారు. అదే పోటీల్లో రెండవ స్థానంలో నిలిచిన ఐశ్వర్యరారు ప్రపంచ సుందరి పోటీలో మొదటి స్థానం పొందారు. ఒకే సంవత్సరం ఇద్దరు భారతీయ మహిళలు 'ప్రపంచ సుందరి', 'విశ్వ సుందరి' కిరీటాలు ధరించి అంతర్జాతీయ స్థాయిలో భారతకీర్తిని మరింత పెంచారు.
అనేక సినిమాల్లో నటించిన ఆమె ఆమె మొదటి చిత్రం దస్తాక్ (1996 ). ఆమె హిందీలో నటించిన రెండో చిత్రం డేవిడ్ ధావన్ నిర్మించిన 'బీవీ నెం .1'. ఇందులో నటనకు గాను ఫిలిం ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డును అందుకున్నారు. ఆంఖెన్ (2002), మెయిన్ హూ నా (2004) వంటి కమర్షియల్ చిత్రాలలో నటించి ప్రేక్షకుల అభిమానాలు అందుకున్నారు. మైనే ప్యార్ కియాన్ కియా (2005). ఫిల్హాల్ (2002), సమరు: వెన్ టైమ్ స్ట్రైక్స్ (2003), చింగారి (2005), జిందాగ్గి రాక్స్ (2006), ఆగ్ (2007) వంటి చిత్రాలు ఆమె ఖ్యాతిని మరింత పెంచాయి. 2015 లో బెంగాలీ చిత్రం 'నిర్బాక్'లో సుస్మిత నటించారు. ు