Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమంది పిల్లలు పండ్లు అంటే చాలు ఆమడ దూరం పరిగెడతారు. పిల్లలు అలా పరిగెత్తడానికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నాయి కొన్ని పరిశోధనలు. పండ్లను ఇష్టపడకపోవడానికి ప్రధాన కారణం ఇంట్లో నూనెలో వేయించిన పదార్థాలను పిల్లలకు పెట్టడం. కార్బోహైడ్రేట్ పదార్థాలను ఎక్కువగా తినిపించడం. పిల్లలు పండ్లు, ఆకుకూరలు తినకపోవడానికి గల కారణాలెంటో తెలుసుకుందాం.
- ఇది ఒక జన్యు సమస్యగా కూడా భావించవచ్చు. కొంతమంది ఒంటరిగా ఉంటే పండ్లను తినడానికి ఇష్టపడరు. అదే విధంగా నలుగురిలో ఉన్నప్పుడు ఇష్టం లేకున్నా పక్కవాళ్లను చూసి తింటుంటారు. ఈ రకమైన భావన కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది.
- శారీరకంగా, మానసికంగా బాగా ఒత్తిడికి గురైనా పండ్లు తినడానికి ఇష్టపడరు. వేపుళ్లకు అలవాటు పడ్డ పిల్లలను అంత త్వరగా మాన్పించడం చాలా కష్టం.
- పండ్ల కన్నా ఎక్కువగా వేటిని ఇష్టపడుతున్నారో తెలుసుకొని వాటికి దూరంగా ఉంచడం మంచిది. ఉదాహరణకు: చిప్స్, చాక్లెట్స్, బజ్జీలు, సమోసా, నూడిల్స్, పానిపూరీ వంటి పదార్థాలకు దూరంగా ఉంచాలి.
- ఆహారం తక్కువగా తీసుకునే పిల్లలను అలసిపోయే వరకు ఆడుకోనివ్వాలి. అలా చేయడం వల్ల ఇంట్లో చేసి పెట్టినవి లేదా అదనంగా ఉన్న పండ్లను తినేస్తారు.
- పండ్లు అంటే ఇష్టపడనీ పిల్లలకు వాటిని వివిధ ఆకారాలు కట్ చేసి పెట్టడం లేదా జ్యూలు చేసి తాగించడం వంటివి చేయాలి.