Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలో నిజాయితిగా పనిచేసే వారికి అందే సత్కారం ఏంటంటే బదిలిలు..ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని ప్రశ్నిస్తే రాజకీయ నాయకుల అండ చూసుకుని అక్కడి నుండి వారిని బదిలి చేయించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు.ఈ కోవలోకే వస్తారు ఐఏఎస్ ఆఫీసర్ దాసరి రోహిణి సింధూరి.ఈవిడ గురించి గూగుల్ లో టైప్ చేస్తే మీకు తొలుత కనిపించేది ఆవిడ ట్రాన్సపర్స్ న్యూసే..దాన్ని బట్టే ఆవిడ నిజాయితి అర్దం చేసుకోవచ్చు.
అమ్మ శ్రీలక్ష్మీ, నాన్న జైపాల్ వారిది ఖమ్మం జిల్లా సత్తుపల్లి, రుద్రాక్షపల్లి గ్రామం. నిత్యం ఇంట్లో గడిపే తల్లిదండ్రుల వ్యక్తిత్వం వారి పిల్లలపై తీవ్రప్రభావం పడుతుంది. ఆమెకు క్రమశిక్షణ అలవడడానికి గల ప్రధాన కారణం అమ్మ శ్రీలక్ష్మీ .ఆమెను ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగం, ఉన్నత జీవితం కోసం అమెరికా పంపాలని ఆశించారు.కాని ''కలెక్టర్ అవుతానమ్మా'' అని ఎంతో ఆశగా కూతురు కోరిన కోరికను తల్లిదండ్రులు కూడా అంతే ఆనందంతో ఒప్పుకున్నారు.. వెంటనే డిల్లీలోని కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేసారు. అన్ని అనుకున్నట్టుగానే జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. మంచి ప్రణాళికలతో ఐ.ఏ.ఎస్ కావడమే ముందున్న లక్ష్యం అనుకుంటున్న తరుణంలో ఆమెకు యాక్సిడెంట్ జరిగింది. ఢిల్లీలో ఓరోజు రోడ్ క్రాస్ చేస్తుండగా అటుగా వస్తున్న కారు రోహిణీ గారిని ఢ కొట్టింది. తగిలిన గాయాలు చిన్నవేం కాదు. సంకల్పం ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా అనుకూలంగా మార్చుకోవచ్చు. ఆమె అలానే చేసింది.
అనుకున్నట్టుగానే ఐఏఎస్ కలను నిజం చేసుకున్నది. ప్రభుత్వం ఏ బాధ్యతలు అందించినా గాని తనలో, సాటి అధికారులలో ఏ తప్పు, నిర్లక్ష్యం దొర్లకుండా పనిచేసేదామె. ఈ కోవలోనే సామన్య ప్రజానీకం నుండి కేంద్ర ప్రభుత్వం వరకు ఎంతోమంది మన్ననలు అందుకున్నది. ప్రస్తుతం కర్ణాటక హసన్ జిల్లా డీసీగా బాధ్యతలు నిర్వహిస్తుండగా కొన్ని సమస్యలపై మంత్రుల నుండి విభేదాలు వచ్చాయి.. ''రోహిణి ఇక్కడ ఉంటే మేము ఆశించిన పనులు జరగవని భావించి'' మంత్రులు రోహిణి గారిని ట్రాన్స్ ఫర్ చేయాలని భావించారు.. ఐతే హసన్ జిల్లా నుండి రోహిణి గారు వెళ్ళితే మళ్ళి పాత పరిస్థితులే వస్తాయని భావించిన అక్కడి ప్రజలు రోడ్డు మీదకు వచ్చి రోహిణి గారిని ట్రాన్స్ ఫర్ చేయడానికి వీలులేదు అని తమ సొంత సమస్యలా ఉద్యమం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రజలు తిట్టుకునే అధికారులు ఎంతోమంది ఉంటారు కాని అధికారుల కోసమే ఇలా ప్రేమతో ఉద్యమాలు చేయించుకునే వారు కొందరే ఉంటారు.ు