Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతిగా స్మార్ట్ఫోన్స్, ట్యాబ్స్, గేమింగ్, డిజిటల్ డివైజులు వాడటం వల్ల కండరాల నొప్పులు తలెత్తుతాయి. గ్యాడ్జెట్లను వాడేటప్పుడు కింద పెట్టుకుని వాడొద్దు. కంటి చూపుకు సమస్థాయిలో గ్యాడ్జెట్ను పెట్టుకుని వాడితే మెడనొప్పి, వెన్నునొప్పి తలెత్తవు. ప్రతి 20 సెకన్లకు ఒకసారి గ్యాడ్జెట్ స్క్రీన్ నుంచి దృష్టి మరలిస్తే కన్ను డిజిటల్ స్ట్రెయిన్కు గురికాదు. గ్యాడ్జెట్ను కంటికి దగ్గరగా పెట్టుకుంటే మంచిది కాదు. తగినంత దూరంలో పెట్టుకుని గ్యాడ్జెట్లను ఉపయోగిస్తే కండ్లు అలసిపోవు. వర్క్ చేసేటప్పుడు గాయాలు కాకుండా కండరాలను వార్మప్ చేయాలి. అలాగే స్ట్రెచెస్ కూడా తప్పనిసరిగా చేయాలి. ఇలా చేయడంవల్ల శరీరానికి గాయాలు కావు. నొప్పులు తలెత్తవు. వ్యాయామం తర్వాత గాయమైనా , ఆడేటప్పుడు గాయమైనా వెంటనే నొప్పి తీవ్రతను గుర్తించేందుకు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్టును సంప్రదించాలి.
ఆఫీసులో లేదా లైబ్రరీలో గంటల తరబడి కూర్చోకుండా గంటకొకసారి కాసేపు అటూ ఇటూ తిరగాలి. ఎందుకంటే ఒకేచోట కదలకుండా కూర్చున్నా కూడా ఒళ్లు నొప్పులు వస్తాయి. నిత్యం వ్యాయామాలు చేయకపోయినా ఈ సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా వెన్నునొప్పి బాధిస్తుంది. రోజూ అరగంట వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే నొప్పులు దరిచేరవు. తక్కువ ప్రభావాన్ని చూపే ఏరోబిక్, స్ట్రెంగ్త్ వ్యాయామాలు చేయాలి. ఆరోగ్యకరమైన శరీర బరువు కలిగి ఉండాలి. సమతులమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.