Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజురోజుకు మానసిక ఒత్తిడి పెరిగి పోతున్నది. ఇంట్లో, ఆఫీస్లో పనిపెరగడంతో మహిళలకు ఏకాగ్రత తగ్గిపోతున్నది. ఆసనాలు వేసే టైమ్ లేకపోవడంతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే రోజూ పదినిమిషాలు కేటాయించినా చాలు.. ఏకాగ్రతతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తి పెంచేందుకు ప్రాణాయామం ఎంతో ఉపయోగ పడుతుంది. ఆసనాలు చేయలేనివారు ఈ ప్రాణాయామం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.
ప్రాణాయామం
ప్రాణాయామం చేయడానికి ముందు రిలాక్స్గా కూర్చోవాలి. ఆ తర్వాత సుఖాసనం లో కానీ, పద్మాసనంలో కానీ ప్రాణాయామం చేయాలి. ముక్కుతో గాలిని నాభి వరకు బాగా పీల్చి ఆ తర్వాత ఆ గాలిని బలంగా నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు బయటకు వదలాలి. ఈ ప్రక్రియలో గాలిని కేవలం బయటకు మాత్రమే వదలాలి. శ్వాస సహజంగా లోనికి వస్తుంది.
ఉపయోగాలు..
1.ఊపిరితిత్తులు శుభ్రపడి శ్వాస సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి.
2. పొట్టకండరాలు బలపడతాయి. ఎత్తుగా ఉండే పొట్ట తగ్గుతుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది.
3. శరీరంలో చెడు కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి ఈ ప్రాణాయామం సంజీవిని వంటిది.
4. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
5. మెదడు శక్తిని పుంజుకొని జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది.
6. నిద్ర లేమితో బాధపడేవారు ప్రాణాయామం చేయడం మంచిది. దీనివల్ల నిద్ర బాగా వస్తుంది.
7. రక్తప్రసరణ బాగా జరిగి వెరికోస్ వెయిన్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
8. ఈ ప్రాణాయామం పరిగడపున చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.
జాగ్రత్తలు..
1. అధిక రక్తపోటు, గుండె సమస్యలు, హెర్నియా, వర్టిగో, అల్సర్ ఉన్నవారు, గర్భిణీలు ప్రాణాయామం చేయవద్దు. ప
- శ్రీచందన
డిజె ఫిట్నెస్ హబ్
9666665458