Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోమలమైన చర్మాన్ని పొందేటందుకు, చర్మకాంతిని రెట్టింపు చేసుకునేటందుకు సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలు మంచివని నిపుణులు చెబుతున్నారు. ఖరీదైన కాస్మొటిక్స్ కంటే ఇంటి పట్టున దొరికే పసుపు, పెరుగు వంటి పదార్థాలతో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్లే చర్మానికి అన్ని విధాలుగా మంచివంటున్నారు. ముఖంలో మెరుపు రావాలంటే ఫేస్ప్యాక్లే కాదు స్క్రబ్ చేసుకోవడం, క్లీనప్ చేసుకోవడం వంటివి తప్పనిసరి. ఇక ఆవిరి పట్టించుకోవడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.
క్లీనప్ : టమాటా జ్యూస్ -రెండు చెంచాలు, క్యారెట్ జ్యూస్ -రెండు చెంచాలు, పాలు-ఒక చెంచా, పసుపు-చిటికెడు.
స్క్రబ్ : ఓట్స్ లేదా బియ్యపిండి-ఒక చెంచా, పెరుగు-అర చెంచా, నిమ్మరసం-ఒక చెంచా.
మాస్క్ : మొక్కజొన్న పిండి-మూడు చెంచాలు, తులసి ఆకుల గుజ్జు-ఒక చెంచా, తేనె-అర చెంచా, చిక్కటి పచ్చి పాలు-రెండు చెంచాలు.
తయారీ : ముందుగా ఒక పాత్ర తీసుకుని టమాటా జ్యూస్, క్యారెట్ జ్యూస్, పాలు, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్ లేదా బియ్యపిండి ఒక బౌల్లోకి తీసుకుని అందులో పెరుగు, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని ముఖానికి అప్లై చేసుకుని, మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని, ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న పిండి, తులసి ఆకుల గుజ్జు, తేనె, పచ్చిపాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని, ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.