Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆహారంలో పీచు పదార్థాలు తీసుకోకపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, నీరు తగిన మొత్తంలో తీసుకోకపోవడం వల్ల పేగుల్లో వ్యర్థాలు పేరుకుపోతాయి. ఈ వ్యద్ధాలను తొలగించడానికి కొన్ని రకాల యోగాసనాలు ఉపయోగపడతాయి. వాటిలో ధనురాసనం ఒకటి.
ధనురాసనం..
బొర్లా పడుకొని కాళ్లు వెనక్కిమడవాలి. కుడిచేత్తో కుడికాలిని, ఎడమిచేత్తో ఎడమకాలి పాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు నెమమదిగా శ్వాస తీసుకుంటూనే తల, భుజాలు, తొడపు మోకాళ్లను పైకి లేపి అదే విధంగా ఇరవై సెకన్లు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా మాములు స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా ఐదు నుంచి పదిసార్లు చేయవచ్చు.
ఉపయోగాలు..
పేగుల్లో వ్యర్థాల నిల్వలు తగ్గుతాయి.
పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.
జీర్ణక్రియ మెరుగవుతుంది
మలబద్దకం సమస్య తగ్గుతుంది.
వెన్నునొప్పి, మెలనొప్పి తగ్గుతాయి.
జాగ్రత్తలు..
హెర్నియా, కడుపులో
అల్సర్లు ఉన్నవారు ఈ
ఆసనం వేయవద్దు.
గర్భీణీలు, సర్జరీలు
అయిన వారు ఈ
ఆసనం వేయవద్దు.
శ్రీచందన
డిజె ఫిట్నెస్ హబ్
9666665458