Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్మం అందాన్ని రెట్టింపు చేసే మాస్క్లివి... వీటితో ముఖం కళకళ లాడుతుంది. అంతేకాదు ముఖంపై ఉండే నలుపు రంగు మచ్చలు, ముడతలు తగ్గుతాయి. సహజంగా ముల్తానీ మట్టితో ముఖానికి వేసుకునే ప్యాక్ మాత్రమే తెలుసు చాలామందికి. కానీ దానికి భిన్నంగా సహజ సిద్ధమైన కలబంద, పుదీన మాస్క్లను ఉపయోగించడం వల్ల చర్మం కోమలంగా, మృదువుగా తయారవుతుంది.
అరకప్పు ఓట్స్ను పొడిగా చేయాలి. ఒక బౌల్లో అరటిపండు గుజ్జు, కలబంద గుజ్జు, ఐదు చుక్కల ఎసెన్షియల్ పిప్పర్మెంట్ ఆయిల్, ఓట్స్ పౌడర్ వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి, మెడకు రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి. ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని ఎండతాకిడి నుండి, కాలుష్యం నుండి కాపాడుతుంది. ముఖ్యంగా కలబంద ఫేస్ మాస్క్ చర్మంపై ఉండే మచ్చల్ని పోగొడుతుంది. చర్మాన్ని మరింత మదువుగా చేస్తుంది.
కండ్ల కింద వలయాలు పోవాలంటే కొన్ని తాజా పుదీనా ఆకులు, ఒక కప్పు డిస్టిల్డ్ వాటర్ తీసుకోవాలి. పుదీనా ఆకుల్ని సన్నగా తరిగి పేస్టులా చేయాలి. ఈ పేస్టును కండ్ల కింద ఏర్పడ్డ నల్లటి వలయాల కింద రాసుకుని 20 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రం గా కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తే నల్లటి వలయాలు పోతాయి. ు