Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలి ఇప్పుడే మొదలైంది. దానికి తోడు వాతావరణ కాలుష్యం. ఈ రెండింటి వల్ల చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చలి వల్ల జలుబు, ఛాతీ, ఊపిరితిత్తుల బాధలు ఎక్కువవుతున్నాయి. వీటి నుంచి బయటపడటానికి కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...
- మైదాపిండితో చేసిన బ్రెడ్, బిస్కట్లు లాంటివి తినకుండా ఉంటే మంచిది. ప్రోసెస్డ్ ఫుడ్స్, చీజ్, నిలువ పచ్చళ్లకు దూరంగా ఉండాలి.
- రాత్రివేళల్లో చల్లని పదార్థాలు తినొద్దు. గుండె సంబంధిత సమస్యలున్న వాళ్లు అసలే తినకూడదు. ఖాళీ కడుపు తోనో లేదా లైట్గా ఆహారం తీసుకున్నప్పుడో పిప్పర్మెంట్ ఆయిల్తో ఆవిరిపట్టుకుంటే మంచిది.
- గోరువెచ్చగా ఉండే ఫ్లూయిడ్లు తీసుకుంటే శరీరానికి ఎంతో సాంత్వనగా ఉంటుంది. వేడి ద్రవపదార్థాలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో చేరిన నెమ్ము కరుగు తుంది.
- వెల్లుల్లి లేదా అల్లం వేసి తయారుచేసిన కాయగూరల సూప్ను వేడిగా తాగితే మంచిది. దీని వల్ల ఊపిరి తిత్తుల్లోని శ్లేష్మం తగ్గుతుంది.
- ఆర్గానిక్ బెల్లం, అల్లం రసం చుక్కలు, కచ్చాపచ్చాగా చేసిన నల్ల మిరియాల పొడి, పిప్పలి (లాంగ్ పెప్పర్) వేడి నీళ్లల్లో వేసి తాగితే ఊపిరితిత్తులకు మంచిది.
- పసుపులో ఉండే కుర్క్యుమిన్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. తాజా పసుపు వేళ్ల నుంచి తీసిన రసాన్ని వేడి సూప్స్లో కలుపుకుని తాగితే మంచిది.
- ఉల్లిగడ్డరసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగినా లేదా పచ్చిఉల్లిగడ్డ మీద నిమ్మరసం పిండుకుని తిన్నా ఊపిరితిత్తుల్లో చేరిన శ్లేష్మం కరిగిపోతుంది.
- ఒక కప్పు వేడినీళ్లల్లో టేబుల్స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి తాగితే కూడా నెమ్ము పోతుంది. కృత్రిమమైన, రసాయన ఆరోమా స్ప్రేలను ఇంట్లో పెట్టొద్దు.