Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాదం పప్పు :బాదం పప్పు మంచి పోషకాహారం. బాదం పాలు ఎంతో శ్రేష్ఠమైనవి.మామూలుగా మనం తీసుకునే పాలతో పోలిస్తే ఇవి ఎంతో ఉత్తమమైనవి అని చెప్పవచ్చు. ఆవుపాలు తాగడానికి ఇష్టపడని పిల్లలకు బాదం పాలు పట్టవచ్చు. బాదం పప్పులో ఇనుము, రాగి. ఫాస్పరస్ వంటి ధాతువులు, విటమిన్ 'బి'లు ఆల్మండ్స్లో ఎక్కువగా ఉంటాయి. రక్తకణాలు, హీమోగ్లోబిన్ సష్టికి, గుండె, మెదడు, నాడులు, ఎముకలు, కాలేయం సక్రమంగా పనిచేయడానికి ఆల్మండ్లు ఎంతగానో తోడ్పడుతాయి. అవి కండరాలు దృఢంగా, ఎక్కువ కాలం పనిచేసేందుకు తోడ్పడుతాయి.
జీడిపప్పు : శరీరానికి కావలసిన ప్రొటీన్లు ఇందులో అధికంగా ఉంటాయి. వీటిలో పొటాషియం, విటమిన్ 'బి', కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే కొవ్వు పదార్థం గుండె జబ్బులను నివారించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్, సెలీనియం, రాగి వంటివి తగిన పరిమాణంలో లభిస్తాయి.
ఎండు ద్రాక్ష : ద్రాక్ష పండ్లు మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి. ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతాయి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి.
ఖర్జూర పండ్లు : ప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్ ఫ్రక్టోజ్లు వీటిలో ఉంటాయి. ఖర్జూరాలను మెత్తగా రుబ్బి నీళ్ళలో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలను తొలగించి కనీసం వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇందులో మంచి పోషకాహార విలువను కలిగిఉంటాయి.
అంజీర్ పండు : ఎండిన అంజీర్ పండులో పీచు, రాగి, మంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, విటమిన్-కె, వంటికి పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్, పాలిఫినోల్స్ను కూడా వీటిల్లో ఉంటాయి. రోజు 35 గ్రాముల ఎండిన అంజీరు పండు పౌడరును తీసుకుంటే, ప్లాస్మాలో యాంటీ ఆక్సిడెంట్ సామ ర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఇందులో కాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది అంజీర్ పండులో మాత్రమే.