Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాతావరణంలో మార్పులు వస్తున్న కొద్దీ చర్మం కూడా రంగులు మారుతుంది. అప్పటిదాకా నిగారించిన ముఖం కాంతిహీనంగా మారిపోతుంది. అయితే కేవలం వాతావరణాన్ని నిందించుకుంటూ కూర్చుంటే లాభం లేదు. ఎందుకంటే వాతావరణం ఒక్కటే కాదు. ముఖం కాంతిహీనంగా మారడానికి కారణాలు చాలా ఉన్నాయి. అవేంటో మీరే చదవండి.
- రోజుకు రెండు సార్లు ముఖం కడుక్కుంటున్నాం కదా... ఇంకా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఏముంది అనుకుంటారు చాలా మంది. కానీ చర్మానికి ఎక్స్ఫోలియేషన్ తప్పనిసరి. ఎందుకంటే పొడిబారిన చర్మం మరింత డల్గా కనిపిస్తుంది. అందుకే ఎక్స్ఫోలియేట్ చేస్తే డల్నెస్ మాయమవుతుంది. అందుఉ చేయాల్సిందలా ముఖానికి మృదువైన మసాజ్.
- ముఖాన్ని కడిగినప్పుడు చర్మంపై ఉన్న సహజమైన నూనెలు పోతాయి. తిరిగి మాయిశ్చరైజర్ పెట్టడం వల్ల చర్మానికి కావాల్సిన సహజమైన కొవ్వు అందుతుంది. చర్మకణాల మధ్య ఉన్న ఖాళీని అది పూరిస్తుంది. మృదువుగా చేస్తుంది. దీనివల్ల చర్మం తిరిగి నీటిని పొందుతుంది.
- ముఖం డల్గా మారడానికి మరో కారణం డీహైడ్రేషన్. అయితే నీళ్లు తాగేస్తే డీహైడ్రేషన్ పోతుంది కదా అనుకుంటారు చాలా మంది. కానీ అది దీర్ఘకాలిక సమస్య. శరీరానికి తరచూ నీటిని అందిస్తుండాలి. ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే నీటిని బాగా తాగాలి.
- ఇవన్నీ చేస్తున్నా ముఖం నీరసంగా కనిపిస్తున్నదా? అయితే మీ శరీరం కంటే.. మీ మెదడు ప్రభావం చూపిస్తుందని అర్థం. మానసిక ఒత్తిడి చర్మంపైన చాలా ప్రభావం చూపిస్తుంది. అది కార్టిజాల్ ఉత్పత్తిని పెంతుంది. ఇది చర్మానికి జరిగే రక్త ప్రసరణ మీద ప్రభావం చూపుతుంది. పని ఒత్తిడైనా కావచ్చు... బంధాల్లో వచ్చే ఇబ్బందులు కావచ్చు.. ఎప్పటికప్పుడు క్లియర్ చేసేకుంటేనే మీ చర్మానికి మంచిది.
- నిద్ర.. శరీరం తిరిగి కొత్తశక్తిని సంతరించుకునే సమయం. పడుకున్నప్పుడే మాత్రమే చర్మకణాలు రిపేర్ చేసుకుంటాయి, కొత్తవి ఉత్పత్తి అవుతాయి. నిద్ర సమయం తగ్గినా, నిద్రకు అంతరాయ కలిగినా చర్మకణాలు రిగ్గా పనిచేయలేవు. ఫలితంగా కళ్లచుట్టూ నల్లని వలయాలు, చర్మం పొడిబారడం, తేమ తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి సరిపడ నిద్రపోండి.