Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్యకాలంలో మహిళలకు అధికంగా వస్తున్నది బ్రెస్ట్ క్యాన్సర్. ముందస్తుగా పసిగట్టడం ద్వారా దీన్ని పూర్తిగా తగ్గించొచ్చు. అయితే ఆ గుర్తించడం ఎలాగన్నదే సమస్య. దీన్ని చాలా సులభతరం చేశారు కేరళకు చెందిన సైంటిస్ట్ డాక్టర్ ఎ.సీమా. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేరళ సైంటిస్ట్ నారీ శక్తి పురస్కారాన్ని అందించారు.
సీమ త్రిసూర్లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీలో ఆమె సైంటిస్టుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత మహిళా పురస్కారమైన నారీ శక్తి అవార్డును ఆమె అందుకున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డు కింద లక్ష రూపాయలను రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ ఆమెకు అందజేశారు. శరీర ఉష్ణోగ్రత ఆధారంగా సెన్సార్ టచ్తో కూడా ఈ బ్రా.. బ్రెస్ట్ క్యాన్సర్ను ముందుగానే పసిగట్టేస్తుంది. ఈ సెన్సార్ సైజ్ 1ఎమ్ఎమ్ లెంగ్త్, 1ఎమ్ఎమ్ విడ్త్, 1.5ఎమ్ఎమ్ డీప్ను కలిగివుంటుంది. దీన్ని సిస్టమ్కు కనెక్ట్ చేయడం ద్వారా 2డీ పిక్చర్ల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ను ముందుగానే పసిగట్టే వీలుంటుంది. ఈ బ్రాలను ధరించిన 15 నుంచి 30 నిమిషాల్లోపు బ్రెస్ట్ క్యాన్సర్ వుందా లేదా అనేది తేలిపోతుంది. ఈ బ్రాలు రూ.200 నుంచి రూ.500ల వరకు పలుకుతున్నాయని సీమా వెల్లడించారు. ఇప్పటివరకు 117 మంది రోగులను ఈ బ్రా ద్వారా పరిశోధించడం జరిగిందని.. మలబార్ క్యాన్సర్ సెంటర్ ఈ పరీక్షల్లో విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. అయితే ఈ బ్రాలను ధరించడం ద్వారా రేడియేషన్, ప్రైవసీ భయం అక్కర్లేదని.. ఇంకా ఎలాంటి నొప్పి వుండదని సీమా వెల్లడించారు.
ఈ బ్రాను రూపొందించడం ద్వారా సీమా నారీ శక్తి అవార్డును గెలుచుకోవడంతో పాటు అంతకుముందు ఆమె సైన్స్ ద్వారా మహిళల కోసం ఉపయోగపడే పరికరాలను కనుగొన్న కారణంగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రూ.5లక్షల నగదుతో సత్కరించింది.