Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీటిని మరిగించి అందులో గుప్పెడు తులసి, క్యాబేజీ ఆకులు వేసి మూతపెట్టి ఇరవైనిమిషాల సేపు అలాగే ఉంచాలి. చల్లారిన తర్వాత వడపోసి ఆ నీటిలో కాటన్ బాల్ ముంచి కండ్ల చుట్టూ అప్లై చేయాలి. ఈ మిశ్రమం యాక్నె, పింపుల్స్కు బాగా పనిచేస్తుంది.
- కీరదోసకాయను చక్రాలుగా కోసి కండ్ల మీద పెట్టుకుని అరగంట సేపు ఉంచుకుంటే క్రమంగా వలయాలు పోతాయి.
- ఒక కప్పులో నీరుపోసి అందులో వాడిన టీ బ్యాగ్లను ఉంచి ఫ్రిజ్లో పెట్టుకుని రాత్రి పడుకునే ముందు కాని, బయటకు వెళ్లి వచ్చిన తరువాత కాని పదిహేను నిమిషాల సేపు కండ్లమీద పెట్టుకుంటుంటే వలయాలు పోతాయి.
- శరీరానికి అవసరమైనంత నీటిని తాగాలి. కనీసం రెండు లీటర్లకు తగ్గకుండా తాగినప్పుడే శరీరంలోని మలినాలు సులభంగా బయటకు పోతాయి. అవసరమైనంత నిద్ర కూడా తప్పనిసరి. ఎంత సమయం అనేది కచ్చితంగా ఉండకపోయినప్పటికీ శారీరక, మానసిక అలసటను బట్టి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం.
- తగినంత విశ్రాంతి పొందినప్పుడు శరీరం రుగ్మతలతో పోరాడే శక్తిని సమకూర్చుకుంటుంది. చర్మం వార్ధక్యానికి దూరంగా నిత్య యవ్వనంతో ఉంటుంది. విశ్రాంతి సమయంలో రక్తంలోని తెల్లరక్తకణాలు ఉత్తేజితమవుతాయి.