Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానసిక ఒత్తిడి, నిద్రలేమి, పోషకాహార లోపం వల్ల కండ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతాయి. ఇవి ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. కండ్ల కింద నలుపు తగ్గాలంటే..
అర టీ స్పూన్ బాదంపప్పు పొడి, కొద్దిగా గంధం పొడి, అరటీస్పూన్ బంగాళదుంప రసం, పది చుక్కల నిమ్మరసం కలిపి కండ్ల కింద నల్లని వలయాలు ఉన్న చోట మృదువుగా రాయాలి. పదినిమిషాలు కండ్లు మూసుకొని, విశ్రాంతి తీసుకొని, తర్వాత చల్లని నీళ్లతో శుభ్రపరచాలి. రోజు విడిచి రోజు ఇలా చేయడం వల్ల నల్లని వలయాలు తగ్గుతాయి.
టీస్పూన్ తేనెలో 2-3 కుంకుమ పువ్వు రేకలు కలిపిన మిశ్రమాన్ని నల్లనివలయాలు, మచ్చలు ఉన్నచోట రాస్తే నలుపు తగ్గి, ముఖ కాంతి పెరుగుతుంది.
రాత్రి పడుకునే ముందు క్యాబేజీని ఉడికించిన నీళ్లను చల్లార్చి ఆ నీటిని దూది ఉండతో కండ్లకిందా, ముఖమంతా రాసుకోవాలి. పదినిమిషాల తరువాత ముఖం శుభ్రపరచుకోవాలి. రోజూ ఈవిధంగా చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి. ముఖకాంతి పెరుగుతుంది.