Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేసవిలో ముఖం త్వరగా జిడ్డుగా అయ్యేవారికి మొటిమలు, యాక్నె సమస్య అధికంగా ఉంటుంది. ఈ సమస్య అదుపులో ఉండటానికి ఇంట్లోనే ఉపయోగించదగిన మేలైన ప్యాక్లు ఇవి.
- పదివేపాకులు, పది తులసి ఆకులు కొద్దిగా మంచినీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. దీంట్లో కొద్దిగా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తరువాత శుభ్రపరచుకోవాలి.
- బంగాళదుంపను మెత్తగా రుబ్బి రసం తీయాలి. ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. యాక్నె వల్ల అయిన మచ్చలు కూడా తొలగిపోతాయి.
- సపోటా తొక్క తీసి గుజ్జు చేయాలి. దీంట్లో పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా రాసి, ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి. రెండు-మూడురోజులకోసారి ఇలా చేస్తూ ఉంటే చర్మం జిడ్డుగా మారదు.
- బంతిపువ్వును కొద్దిగా పాలుకలిపి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత కడిగేయాలి. మొటిమలు, తరచూ ఇలా చేస్తుంటే యాక్నె వల్ల అయిన మచ్చలు తగ్గిపోతాయి.
- టీ స్పూన్ తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి మొటిమలు, మచ్చలు, బ్లాక్హెడ్స్ ఉన్న చోట రాయాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ప్రతి మూడురోజులకోసారి ఈ ప్యాక్ వేసుకోవాలి. మొటిమలు, మచ్చలు, బ్లాక్హెడ్స్ మెల్లగా తగ్గిపోతాయి.