Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బరువు తగ్గాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామాలు చేయడం, ఆహారాన్ని తగ్గించడం, యోగా ఇలా ఎన్నో . అయితే ఇంట్లో దొరికే వంట దినుసులతో కూడా బరువు తగ్గవచ్చు.
పసుపు: బరువును తగ్గించే ఔషధాలకు పెట్టింది పేరు పసుపు. ఇందులోని ఔషధాలు ఫ్యాట్ టిష్యూలు ఏర్పడకుండా అడ్డుకుంటాయి. నిరంతరం ఈ ప్రక్రియ జరగడం వల్ల శరీరంలో కొవ్వు పెరగదు.
జీలకర్ర: కొన్ని రకాల వంటకాల్లోకి మాత్రమే జీలకర్రను వాడుతుంటాము. అయితే దీన్ని ఇంకాస్త పెంచడం మంచిది. ప్రొడక్షన్ ఎనర్జీ పెరగడమే కాకుండా.. రోగనిరోధక శక్తి వద్ధి అవుతుంది.
దాల్చినచెక్క: బరువును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్లో హెచ్చుతగ్గులు లేకుండా చూస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. జీర్ణక్రియల్ని చురుగ్గా ఉంచడం వల్ల అతిగా ఆకలి వేయడం కాని, ఆకలి మందగించడం కాని ఉండదు.
అల్లం: శరీరాన్ని ఒక రకంగా శుభ్రపరిచే సుగుణం అల్లానికి ఉంది. జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచడం దీని ప్రత్యేకత. ఆహారంలో తరచూ అల్లం వాడటం వల్ల అరుగుదల శక్తి పెరుగుతుంది.
యాలకులు: జీర్ణప్రక్రియల్ని చురుగ్గా ఉంచగలిగే దినుసుల్లో యాలకులు ముఖ్యమైనవి. ఎప్పుడైతే జీర్ణవ్యవస్థకు సమస్యలు రావో అప్పుడు చెడుకొవ్వు శరీరంలో పేరుకుపోదు.
ఆవాలు: మెటాబాలిక్ యాక్టివిటీ పెరిగేందుకు ఆవాలు ఎంతగానో తోడ్పడతాయి. భారతీయ వంటకాల్లో మసాలాలు, నూనెల వాడకం అధికంగా ఉన్నప్పటికీ.. ఆవాలు తప్పక తింటారు కనక.. కొంత ముప్పు తగ్గుతోంది.
మొక్కజొన్నతో మృదువుగా
చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృత కణాలను తొలగిస్తూ ఉండాలి. కార్న్ఫ్లేక్స్ని పొడిచేసి అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దనా చేయాలి. మృత కణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.
- గుడ్డులోని తెల్లసొన, టేబుల్స్పూన్ పంచ దార, అర టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కలిపి ముఖా నికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత శుభ్రపరచు కోవాలి. వారానికి రెండుసార్లు ఈవిధంగా చేయడం వల్ల ముఖం మీద వచ్చిన అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి.
- టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లేక్స్ పొడి, ఓట్స్ పొడి, తగినన్ని పాలు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు అలాగే ఉంచి, తర్వాత ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మకాంతి మెరుగవుతుంది.
- కార్న్ ఫ్లేక్స్ పొడిలో అరటీస్పూన్ పసుపు, బాదాం నూనె, కొద్దిగా వెచ్చని నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు, మడమలకు రాసి మృదువుగా రుద్దాలి. దీంతో గరుకుగా మారిన పాదాల చర్మం మృతకణాలు తొలగిపోయి మృదువుగా మారుతుంది.
జీర్ణక్రియను వేగవంతం చేయడంలో నిమ్మరసం భలేగా పని చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలిగించి ఆకలి పుట్టేలా చేస్తుంది. ఆకలి మందగించినపుడు గ్లాసు నీళ్లలో కాస్త నిమ్మరసం పిండి, అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకోండి. కాసేపటికి ఆకలి బాగా వేస్తుంది.
ఎ పోషక విలువులు మెండుగా ఉన్నా ఖర్జూరాలకు ఆకలి పుట్టించే గుణం కూడా ఎక్కువే. దీన్ని రసంలా చేసి కూడా తీసుకోవచ్చు. ప్రతి రోజూ నాలుగైదు ఖర్జూరాలు తింటే ఆకలి లేమి తీరిపోతుంది.
- వికారం, అజీర్తికి అల్లం మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ నాలుగైదు అల్లం ముక్కలను దవడకు పెట్టుకుని నమిలి, ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. దీనివల్ల క్రమంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఆకలి కూడా వేస్తుంది.
- పొట్టలో గ్యాస్ను బయటకు తోసేయడంలో మెంతులు బాగా పని చేస్తాయి. దీంతో ఆకలి పెరుగుతుంది. ప్రతి రోజూ మెంతిపొడిని తేనెతో కలిపి తగిన మోతాదులో తీసుకుంటే ఆకలి పుడుతుంది.
- ద్రాక్షలో విటమిన్-సి ఉంటుంది. అది జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది. భోజనం చేశాక కొన్ని ద్రాక్షపళ్లు తినండి. తీసుకున్న ఆహారం తొందరగా అరుగుతుంది.
బాదంతో బంగారు రంగు
బాదాములలో చర్మాన్ని శుభ్రపరిచే గుణాలతో పాటు యవ్వనాన్ని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. బాదం గింజలను పొడిచేసి ఒక బాటిల్లో పోసి ఫ్రిజ్లో పెట్టుకుని రోజూ వాడుకోవచ్చు. పొడి మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా చేయాలి.
- ఒక స్పూను బాదం పొడిలో తగినన్ని నీళ్లు వేసి పేస్ట్లా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖం, మెడ, చేతులకు పది నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఈ రకంగా చేస్తే చర్మానికి పట్టిన మురికి, చర్మం లోపలి గ్రంథులు విడుదల చేసిన మలినాలు తొలగిపోయి శుభ్రపడుతుంది. మృత కణాలను తొలగిస్తుంది కాబట్టి చర్మం కొత్త కాంతితో మెరుస్తుంది.
-బాదం పొడిలో పాలపొడి, కొద్దిగా నీటిని చేర్చికలుపుకోవాలి. పాలపొడికి బదులుగా పాలు కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, మెడకు ప్యాక్వేసి ఐదునిమిషాల తర్వాత మర్దన చేయాలి. అనంతరం చన్నీటితో కడిగితే చర్మం మునుపటికంటే కాంతులీనుతుంది.