Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాజా ఆకుకూరలు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే శిరోజాల నిగనిగలు పెరగాలంటే ఆకులతో చెలిమిచేయాలి.
- రెండు కప్పుల నీళ్లను మరిగించి అందులో 5-6 తాజా/ఎండు తేయాకులను వేసి, మూత పెట్టాలి. చల్లారిన తర్వాత ఈ నీటిని తలవెంట్రుకలకు పట్టించాలి. అరగంట తర్వాత షాంపూ వాడకుండా కేవలం చల్లని నీటితో తలను శుభ్రపరచుకోవాలి. వారానికి ఒకసారైనా ఇలా చేయడం వల్ల కేశాలు పొడిబారవు. చిట్లడం వంటి సమస్యలు కూడా రావు.
- గుప్పెడు తులసి ఆకులను తీసుకుని మెత్తగా రుబ్బి, రసం తీయాలి. ఈ రసాన్ని మాడుకు పట్టించి, అరగంట తర్వాత కడిగేయాలి. చుండ్రు, ఇతర చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
- కలబంద ఆకును మధ్యకు విరిచి దాని నుంచి వచ్చిన జెల్ను తలకు రాయాలి. తలస్నానం చేసిన తర్వాత కలబంద జెల్ప్యాక్ వేసి, పది నిమిషాల తరువాత కడిగేయాలి. దీనివల్ల వెంట్రుకలకు కండిషనర్ లభించి, మృదువుగా మారుతాయి.
- వేపాకులను శుభ్రం చేసి, ముద్దగా నూరి రసం తీయాలి. ఈ రసాన్ని తలకు పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. చుండ్రు, పేల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ు