Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండ్లు ఆరోగ్యాన్నివ్వడమే కాదు...అందాన్నిపెంచడంలోనూ తోడ్పడుతాయి. అందుకే ఈ ఫేస్ప్యాక్స్...
- అరటి పండును తీసుకుని మెత్తటి గుజ్జుగా నలుపుకోవాలి. అందులోకి మూడు చుక్కల తేనె కలుపుకుని ముఖానికి మాస్క్ వేసుకుంటే మంచిది. ఇరవై నిమిషాలయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖం మీదున్న జిడ్డు, ధూళి కణాలు తొలగిపోతాయి. మొటిమలు కూడా రావు.
- కేవలం టమోటోతో మాత్రమే ముఖానికి మాస్క్ వేసుకుంటే చాలు. ఇందులోకి ఎలాంటి అదనపు పదార్థాలు కలపాల్సిన పనిలేదు. టమోటోతో ముఖానికి మసాజ్ చేసుకుంటున్నప్పుడు అందులోని విత్తనాలు బ్రెష్లా పనిచేస్తాయి.
- బాగా మగ్గిన నల్లద్రాక్ష పండ్లను గుజ్జుగా చేసుకుని.. అందులోని విత్తనాలను పక్కన పడేయాలి. ఆ గుజ్జును ముఖానికి వేసుకోవాలి. అరగంట వరకు అలాగే ఉంటే.. తడి ఆరిపోతుంది. ఆ తరువాత శుభ్రం చేసుకోవచ్చు.
- బొప్పాయి గుజ్జుతోను ఇదే పనిచేయవచ్చు. అయితే మరీ పచ్చిది వాడకండి. అలాగని మాగిన పండు కూడా వాడొద్దు. మధ్యస్తంగా ఉండే బొప్పాయిలోని లోపలి గుజ్జు ముఖానికి రాసుకోండి .పదిహేను నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది.
- నారింజపండ్ల పల్ప్ను ఇలాగే ముఖానికి వేసుకోవచ్చు. ఇందులోని విటమిన్ సి ముఖాన్ని మరింత కాంతివంతం చేస్తుంది.