Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్న చిన్న విషయాలే అయినా ఒక్కోసారి నిర్లక్ష్యం చేస్తుంటాం. అలాగే ఆహార పదార్థాలు, అలవాట్ల విషయంలోనూ అలానే చేస్తుంటాము. కానీ సంపూర్ణ ఆరోగ్యానికి తప్పని సరిగా కొన్ని పాటించాలి.
- ప్రతిరోజూ పెరుగు తింటే చిగుళ్ళ వ్యాధులు రావు. పెరుగులోని లాక్టోబాసిలి అనే బ్యాక్టీరియా నోటిలో చిగుళ్ళపై పేరుకొని ఉండే తీపి పదార్థాలను తిని జీవిస్తాయి. దానివల్ల చిగుళ్ళు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి .
- క్యారెట్లలో ఉండే ఫాల్ కారినల్ కాన్సర్ను నిరోధిస్తుందని చాలా అధ్యయనాలలో తేలింది. కానీ వాటిని తరగకుండా ఉడకబెట్టి తింటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. క్యారట్ని తరిగి, ఉడకబెట్టడం వలన వాటిలో ఉండే ఇతర పోషకాలు కూడా నీటిలో కలిసిపోతాయట. క్యారట్కు ప్రత్యేకమైన తియ్యటి రుచిని ఇచ్చే చక్కెరలు సైతం కరిగిపోతాయి. కాబట్టి ఆరోగ్యం కోసం క్యారట్ తినాలంటే అలాగే తరగకుండా ఉడికించి తినాలి, లేదా పచ్చిగా తినాలి.
- ఆరోగ్యానికి పండ్ల రసాలు మంచివని మనకి తెలుసు. అయితే మందులు వేసుకున్న వెంటనే మాత్రం పండ్లరసాలు త్రాగకూడదు. అలా తాగితే మందులు పూర్తిస్థాయి ఫలితాలని ఇవ్వవు.
- రోజూ వీలైతే మధ్యాహ్నం భోజనం తరవాత ఒక 45 నిముషాలు చిన్న కునుకు తీయండి. ఆ కునుకు మీ గుండెను కాపాడుతుంది. రోజూ మధ్యాహ్నం 45 నిముషాలు పడుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, దానివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి వలన, రాత్రిపూట గాఢంగా నిద్రపోయే సమయం తగ్గడంతో రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలు పెరిగిపోయాయని, ఆ ముప్పు నుండి తప్పించుకోవాలి అంటే, పగటినిద్ర అవసరం అని సూచిస్తున్నారు వీరు.
- సన్నగా కనిపించాలి అన్న ఆరాటంతో గంటలకి గంటలు కఠిన వ్యాయామాలు చేయడం వలన, లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు నిపుణులు. వ్యాయామం చేసేముందు ఎంత సమయం వ్యాయామం చెయ్యాలి, ఎలా చెయ్యాలి వంటి విషయాలలో నిపుణుల సలహా తీసుకోవటం తప్పనిసరి. ఎందుకంటే అవగాహన లేకుండా ఎక్కువ సమయం కఠిన వ్యాయామాలు చేస్తే గుండె సంబంధిత సమ స్యలు వచ్చే ప్రమాదంఎక్కువంటున్నారు నిపుణులు