Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చక్కెర అంటే చాలా మందికి ఎనలేని తీపి. రోజువారి జీవితంలో చక్కెర ని ఏదోరూపంలో తీసుకునే వాళ్లు అత్యధికం. అయితే చక్కెర మూలాన చాలా సమస్యలు వస్తాయనేది చేదు నిజం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ చక్కెర వల్ల వచ్చే నష్టాలేంటో తెల్సుకుందాం.
- స్వీట్స్, ఐస్క్రీమ్స్, చాకొలేట్స్, పేస్ట్రీస్, ఫాస్ట్ఫుడ్, ఫ్రూట్ జ్యూస్.. ఇలా ప్రతీ రోజూ మనం తీసుకునే ఆహారంలో చక్కెరశాతం అధికంగా ఉంటుంది. వాస్తవానికి రోజుకి మహిళలు ఆరు టీ స్పూన్ల చక్కెరని, మగవారు తొమ్మిది స్పూన్లు తీసుకుంటే సరిపోతుందట. అయితే మోతాదుకి మించి చక్కెరని తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు.
ఉండాల్సిన దానికంటే చక్కెరశాతం శరీరంలో ఎక్కువ ఉంటే మొదట రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీని వల్ల త్వరగా అనేక వ్యాధులు శరీరాన్ని చుట్టుముడతాయి.
- శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ చక్కెరలో ఉండవు. కూల్ డ్రింక్స్, ప్రాసెసింగ్ ఫుడ్స్ తినటం వల్ల చక్కెర అధికమైతే పిల్లలైనా, పెద్దలైనా విపరీతమైన బరువు పెరుగుతారు.
- శరీరంలో చక్కెరశాతం అధికమైనపుడు డయాబెటి స్ వస్తుంది.
చక్కెర వల్ల నోట్లో చెడు బ్యాక్టీరియా వ్యాప్తి అవుతుంది. దంతాలు చెడిపోతాయి.
అధిక మోతాదులో శరీరంలోకి చక్కెర చేరితే కాలేయం దెబ్బతింటుంది. దీంతో పాటు క్యాన్సర్ వచ్చే శాతం అధికంగా ఉందట.
- చక్కెరలో హై కొలెస్ట్రాల్ లెవెల్స్ వల్ల జీవక్రియ దెబ్బతింటుంది. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. దీని వల్ల గుండె జబ్బులు వస్తాయి. అందుకే చక్కెరకి ప్రత్యా మ్నాయంగా ఉండే వాటిని తీసుకోండి. నాలుకకి రుచి ఉండే చక్కెర శరీరానికి చేటు అని గ్రహించకుంటే కోరి కష్టాలు కొని తెచ్చుకోవటమే.