Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాజా పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిసిందే. అలాగని క్రమ పద్ధతి లేకుండా పండ్లను ఆరగిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు పోషకాహార నిపుణులు. హెల్దీడైట్ అంటే పండ్లు తీసుకోవడం మాత్రమే కాదని.. వాటిని తినే సమయానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు.
- కొందరు భోజనం చేసిన తర్వాత పండ్ల ముక్కలు తింటే గానీ తప్తిగా ఫీలవ్వరు. అయితే ఇది సరైన విధానం కాదని అంటున్నారు వైద్యులు. భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. కొన్నాళ్లు ఇదే డైట్ ఫాలో అయితే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చని చెబుతున్నారు.
- పరగడుపున ఓ గ్లాసెడు నీళ్లు తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ తినడానికి అనువైన సమయమంటున్నారు నిపుణులు. ప్రతి రోజూ ఉదయం నాలుగు రకాల పండ్ల ముక్కలను తీసుకోవడం వల్ల రోజంతా ఎనర్జిటిక్గా ఉంటుంది.
- భోజనం చేసిన తర్వాత పండ్లు తినడానికి కనీసం అరగంట గ్యాప్ ఇవ్వాలి. మధుమేహం, అసిడిటి వంటి జీర్ణ సంబంధమైన ఇబ్బందులు ఉంటే.. భోజనానికి గంట ముందు, భోజనం తర్వాత రెండు గంటల వరకు పండ్లు తీసుకోకూడదు.
- జీర్ణక్రియ సాఫీగా ఉన్నప్పుడు పండ్ల ముక్కలను పాలతో కలిపి తీసుకోవచ్చు. పైనాపిల్, వాటర్ మెలన్ వంటి పండ్ల ముక్కలను ఉప్పు మిక్స్ చేసి టేస్ట్ చేయవచ్చు. కానీ, డైజేషన్ సమస్యలు ఉన్నవారు ఇలాంటి ప్రయత్నాలకు దూరంగా ఉండటమే మంచిది.
- మూడు, నాలుగు రోజుల కంటే ఎక్కువగా నిల్వ ఉన్న పండ్లను ఆరగించడం అంత సేఫ్ కాదు. రిఫ్రిజిరేటర్లలో ఉంచాం కదా.. ఫ్రెష్గానే ఉంటాయని అనుకోవద్దు.