Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు అన్నింటికీ స్మార్ట్ఫోనే ఆధారంగా మారింది. నేటి అవసరాలు, ఆధునిక టెక్నాలజీ కారణంగా స్మార్ట్ఫోన్ను పక్కన పెట్టే పరిస్థితి లేదు. కానీ అదొక తీవ్రమైన అలవాటుగా మారి, రోజులో ఓ రెండు గంటలకు మించి స్మార్ట్ఫోన్ వాడుతున్నట్టయితే జాగ్రత్త.
- స్మార్ట్ ఫోన్ అతిగా వాడేవారిలో ఏకాగ్రత శక్తి బలహీనపడుతుంది. సాధారణంగా మన ఏకాగ్రత సమయం 12 సెకండ్ల కంటే ఎక్కువే ఉంటున్నట్లు 2000లో నిర్వహించిన పరిశోధన ఫలితాలు చెబుతుండగా, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత ఇది 8 సెకండ్లకు తగ్గిందని తేలింది.
- స్మార్ట్ ఫోన్ను దీర్ఘకాలం పాటు రోజులో అధికసమయం వాడితే అరచేయి, వేళ్ల లోని ఎముకలు, మణికట్టులో నొప్పులు వంటివి కనిపిస్తాయంటున్నారు నిపుణులు.
- స్మార్ట్ ఫోన్ వినియోగం నిద్రపై చెడ్డ ప్రభావం చూపిస్తుంది. రాత్రి పడకగదిలో మంచంపైకి ఎక్కిన తర్వాత స్మార్ట్ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్ వంటి వాటిలో ఏదైనా పట్టుకున్నారంటే నిద్ర సరిగా పట్టదు. 63 శాతం మంది నిద్రాభంగాన్ని ఎదుర్కొంటున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. కారణం స్మార్ట్ఫోన్ల నుంచి వెలువడే బ్లూ లైట్. నిద్రించే ముందు కాఫీలు తాగొద్దని చెబుతుంటారు. ఇందులోని కెఫైన్ నిద్ర రానీయదు. అయితే కాఫీ కంటే స్మార్ట్ డివైజ్ల స్క్రీన్ల నుంచి వెలువడే బ్లూ లైట్ చాలా హానికరమట.
- స్మార్ట్ఫోన్తో వచ్చిన మరో పెద్ద చిక్కు దాన్నే లోకంగా భావిస్తూ అందులోనే గంటల తరబడి సమయం గడుపుతూ మిగిలిన వారిని, మిగిలిన లోకాన్ని విస్మరించడం. భౌతిక ప్రపంచం కంటే ఆన్లైన్ ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడిపేందుకు అలవాటు పడడానికి ఇష్టపడతారు. నలుగురిలో ఉన్నా, ఇంట్లో భార్యాపిల్లలతో ఉన్నా, బంధువులు వచ్చినా వారితో వెచ్చించే సమయం స్వల్పమే. ఎక్కడున్నా స్మార్ట్ఫోన్పై చేతివేళ్లు కదులు తూనే ఉంటాయి. దీనివల్ల వ్యక్తిగత సంబంధాలు, అను బంధాలు సైతం దెబ్బతింటాయి.
- టాయిలెట్ సీటుపై ఉండే బాక్టీరియా కంటే స్మార్ట్ఫోన్పై 10 రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది.
- స్మార్ట్ఫోన్ వినియోగం ఎక్కువైతే మెదడుకు సహజ సిద్ధంగా ఉండే సామర్థ్యం తగ్గుతుందంటున్నారు వైద్యులు. ఫలితంగా మెమరీ పవర్ దెబ్బతింటుంది. మెదడు పాత విషయాలను తిరిగి స్మరణకు చేసుకునే శక్తి బలహీనపడుతుంది.
ఙ స్మార్ట్ ఫోన్లో నేడు దాదాపుగా అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. పొరపాటుగా సెల్ఫోన్ పోయినా, ఎవరైనా తస్కరించినా అందులో ఉన్న మీ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలు, బ్యాంకు ఖాతాల సమాచారం, కాంటాక్టులు, పర్సనల్ ఫైల్స్, మీడియా ఇలా అన్నీ ఇతరుల చేతుల్లో పడితే వచ్చే అనర్థం ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించుకోండి.
- ఆఫీసులో అప్పటి వరకు పని ఒత్తిడి ముగించుకుని ఇంటికి రాగా, ఆ తర్వాత కూడా ఫోన్తో కమ్యూనికేషన్ నడుస్తూనే ఉంటుంది. ఇది ఆందోళనకు, ఒత్తిడికి కారణమవుతుందని, రక్తపోటు తదితర సమస్యలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
- ఇక స్మార్ట్ ఫోన్ పడకగదిలోకి ఎప్పుడో ప్రవేశించింది. దీంతో జీవిత భాగ స్వామితో సన్నిహితంగా మెలగడానికి సమయం తగ్గిపోతుంది. నిద్రకూడా కరువవుతోంది. పడకమంచంపై విశ్రాంతిగా పడుకున్నా స్మార్ట్ ఫోన్లో విహరించడమే సరిపోతుంది.