Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ప్రకృతిపరమైన మార్పులకు ఎక్కువగా గురయ్యేది కూడా చర్మమే. వ్యక్తిగత శుభ్రతా లోపం, శారీరక మార్పులు వంటి ఎన్నో కారణాల వల్ల చర్మం దెబ్బతినటం సహజమే. ఈ సందర్భాల్లో గృహవైద్యం చక్కగా పనిచేస్తుంది. ఆ వివరాలు...
- దురదలు, దద్దుర్లు వేధిస్తుంటే స్నానపు నీటిలో గుప్పెడు కళ్లుప్పు, ఒక నిమ్మకాయ పిండి ఆ నీటితో స్నానం చేస్తే సమస్య తగ్గటమే గాక శరీరం కాంతివంతమవుతుంది.
- గజ్జి, తామర లక్షణాలు కనిపించిన వెంటనే తులసి ఆకు నూరి అందులో నిమ్మరసం కలిపి పట్టిస్తే లక్షణాలు మాయమవుతాయి. లేదా కిరోసిన్ రాసినా చాలు.
- ఒంటిపై తెల్ల మచ్చలు కనిపిస్తే వాటిపై తెల్ల గన్నేరు ఆకులు నూరి లేపనంగా పూస్తే మచ్చలు మాయమవుతాయి.
- తెల్ల బొల్లిమచ్చలకు మినుములను నీటితో నూరి పట్టిస్తుంటే క్రమంగా ఆ మచ్చలు పోతాయి.
- తులసి ఆకు, హారతి కర్పూరం కలిపి నూరి రాత్రిపూట శోభి మచ్చలపై రుద్ది తెల్లారి కడగాలి. ఇలా 3 వారాల పాటు చేస్తే శోభిమచ్చలు శరీరంలో కలిసిపోతాయి.
- అరికాళ్లలో ఆనెలు పెరిగి ఇబ్బందిగా ఉన్నప్పుడు వారంపాటు జిల్లేడు పాలు, ఆముదం సమంగా కలిపి రుద్దితే ఆనెలు హరించిపోతాయి.
- 5 గ్రాముల తేనె, 8 గ్రాముల నెయ్యి కలిపి పూస్తుంటే అధిక వేడి వల్ల ఒంటిపై పడిన తీవ్రమైన వ్రణాలు మానిపోతాయి.
- వాతావరణ మార్పుల మూలంగా దురదలు, దద్దుర్లు వస్తే నిప్పుల మీద వాము చల్లి ఆ పొగను ఒంటికి పారేలా చేస్తే సరి.
- 3 గ్రాముల పసుపు, 6 గ్రాముల ఉసిరి పొడి గ్లాసు నీటిలో కలిపి సేవిస్తుంటే రక్తశుద్ధి జరిగి చర్మ సమస్యలు రావు.