Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినేష్ ఫొగట్... కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్లో స్వర్ణం సాధించిన మొట్టమొదటి రెజ్లర్. అరోగాంట్ అన్నారు... ఎన్నో గాయాలయ్యాయి. ఒకానొక దశలో అసలు కెరీర్ ముందుకు సాగుతుందా అన్న అనుమానం కూడా కలిగింది. కానీ అన్నింటినీ అధిగమించింది. ఎన్నో అంతర్జాతీయ పతకాలను సాధించింది. గాయం కారణంగా రియో ఒలింపిక్స్లో పరాజయం పాలైన వినేశ్... 2020లో జరగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించింది. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణమే నా లక్ష్యమంటున్నది వినేశ్.
1994 ఆగస్టు 25న హర్యానాలో జన్మించింది వినేశ్. తండ్రి రాజ్పాల్. రెజ్లర్ మహవీర్సింగ్ ఫొగట్ సోదరుడు. తన కూతుళ్లు... గీతా, బబితలతోపాటు వినేశ్, రీతూలకు కూడా రెజ్లింగ్లో శిక్షణ ఇప్పించాడు మహవీర్సింగ్. అలా నేర్చుకున్న వినేశ్... న్యూఢిల్లీలో 2013లో జరిగిన ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం గెలిచింది. నుంచి రికార్డులు సృష్టిస్తూనే ఉన్నది. తరువాత జరిగిన కామన్వెల్త్ రెజ్లింగ్ పోటీల్లో రజతాన్ని దక్కించుకున్నది. అంతేకాదు గ్లాస్గో (2014)లో జరిగిన కామన్వెల్త్ క్రీడలతోపాటు.. 2014లో ఇంచియాన్లో జరిగిన ఆసియా క్రీడలలో 48 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. 2015లో దోహాలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్లో రజతాన్ని దక్కించుకుంది. అలవోక విజయాలతో.. రియోలో ఒలింపిక్స్లో కాలిగాయంతో అనూహ్యంగా తొలిరౌండ్లోనే ఓడింది. దీంతో వినేశ్ ఫొగట్పై అప్పట్లో విమర్శలు రావడంతోపాటు పతకం చేజారినందుకు ఎంతో ఆవేదన చెందింది. గాయం నుంచి కోలుకున్న అనంతరం రెండేం డ్లుగా నిలకడగా విజయాలు సాధిస్తూ ఇండోనేషియా ఆసియా క్రీడలలో హాట్ ఫేవరెట్ హౌదాతో బరిలోకి దిగింది. స్వర్ణాన్ని సాధించింది. ఆసియా క్రీడలలో స్వర్ణం అందుకున్న తొలి మహిళా రెజ్లర్గా వినేశ్ రికార్డు నమోదు చేసింది. 50 కేజీల కేటగిరీ ఫైనల్లో జపాన్ రెజ్లర్ ఇరీ యుకీపై 6-2 స్కోరుతో ఓడించి ఘన విజయం సాధించింది. వినేశ్ తాజాగా జరుగుతున్న ఆసియా క్రీడలలో స్వర్ణంతో వరుస క్రీడల్లో పతకాలు సాధించిన తొలి మహిళా రెజ్లర్గా కొత్త రికార్డు నెలకొల్పింది. 2018లో గోల్డ్కోస్ట్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల లోనూ బంగారు పతకాలతో వినేశ్ మెరిసింది.ఇటీవల పోలండ్లో జరిగిన ఓపెన్ రెజ్లింగ్ టోర్నమెంట్లో విజయం సాధించి... 2020లో టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించింది. రెజ్లింగ్లో దేశానికి అందించిన మెడల్స్కు గాను భారత ప్రభుత్వం వినేశ్కు 2016లో అర్జున అవార్డును దక్కించుకుంది. 2018లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమెను పద్మశ్రీకి నామినేట్ చేసింది కానీ.. అవార్డు దక్కలేదు.
లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ అయిన భారతీ మొదటి అథ్లెట్ వినేశ్. ఇంకా రెజ్లింగ్కు గుర్తింపుకోసమే పోరాడుతున్న మనకు.. లారెస్ అవార్డుకు నామినేట్ కావడమన్నది గొప్ప విజయమే. చిరకాల స్నేహితుడు అయిన సహచర అథ్లెట్ సోమ్వీర్రాథిని ప్రేమించి పెండ్లి చేసుకుంది వినేశ్. పెండ్లి తరువాత స్పార్క్, ఆడాలన్న కసి తగ్గిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆమె ఆ విశ్వాసాన్ని బ్రేక్ చేయాలనుకుంది. పెండ్లి అన్నింటికీ అడ్డంకు అనుకునే అమ్మాయిల మనసుల్లోని భయాలను తరిమి కొట్టాలనుకున్నది. తనో ఆదర్శం కావాలనుకున్నది. అందుకే తొందరగా పెండ్లి చేసుకున్నది. పెండ్లి తరువాత కచ్చితంగా జీవిత భాగస్వామి సహకారం కావాల్సిందే. సహచ రుడు, తోటి అథ్లెట్ సోమ్వీర్ నుంచి ఆమెకు పూర్తి సహకారం అందుతున్నది.
స్వర్ణమే నా లక్ష్యం...
''చిన్నప్పటినుంచి చాలా ధైర్యంగా ఉండేదాన్ని. కొన్నిసార్లు అది తప్పయినా.. కరెక్టని నేను నమ్మితే.. ఎప్పుడో ఒకరోజు నాతో పాటు దాన్ని అందరూ నమ్ముతారనుకునేదాన్ని. అంత మొండిగా ఉండేదా న్ని. తరువాత తరువాత మార్చుకున్నాన నుకోండి. అయితే ఇప్పుడు తలపొగరు అని చాలామంది అనుకుంటారు. ఒక్కసారి రెజ్లింగ్ మ్యాట్లోకి దిగాక అదే నాకు సాయం చేస్తుంది. కాబట్టి దేని గురించి నేను పట్టించుకోను. అది అతి విశ్వాసం అనుకోవచ్చు. మన దేశంలో నలుగురైదుగురు బలమైన పోటీదారులున్నారు. ప్రపంచంలోని ఏ రెజ్లర్నైనా ఓడించగలరు. వాళ్ల పేర్లు చెప్పను. కానీ రెజ్లింగ్ ఈసారి కచ్చితంగా రెండు మూడు ఒలింపిక్ మెడల్స్ వస్తాయన్న నమ్మకం నాకుంది. గతంలో ఇంటర్నేషనల్ వేదిక మీద ఆడటానికే వెదుక్కోవాల్సి వచ్చేది. కానీ.. ఇప్పుడలా కాదు. రియో ఒలింపిక్స్లో సాక్షి కాంస్యం గెలిచిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. గతంలో మనం పవర్గేమ్ ఆడేవాళ్లం కానీ... ఇప్పుడు సాంకేతికంగా స్మార్ట్గా ఆడగలుగుతున్నాం. ఇక సోమ్వీర్ లేకపోతే... నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. నా కుటుంబం కంటే కూడా నా విజయానికి కారణం సోమ్వీర్. అతను మోటివేట్ చేసినట్టుగా మరెవరూ చేయలేదు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణమే నా లక్ష్యం'' అని చెబుతున్నది.