Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయం
యూఎస్ మిలటరీ స్థావరాలపై ఇరాన్ దాడి
ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ 2020 జనవరి 7న క్షిపణుల వర్షం కురి పించింది. అమెరికా సైనికులు, సంకీర్ణ దళాలు ఉన్న అల్ అసద్, ఇర్బిల్ మిలటరీ స్థావరాలపై ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో 80 మంది అమెరికా సైనికులు చనిపోయారని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని అమెరికా చంపినందుకు ప్రతీకారంగానే ఈ క్షిపణి దాడి జరిగిందని ఇరాన్ అధికార టీవీ పేర్కొంది. ఇరాన్ జనరల్ సులేమానీ మతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలకు రూ.575 కోట్ల భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది.
బ్రెగ్జిట్కు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. హౌజ్ ఆఫ్ కామన్స్లో 2020 జనవరి 9న జరిగిన ఓటింగ్లో బ్రెగ్జిట్ బిల్లుకు అనుకూలంగా 330 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి. దీంతో 2020 జనవరి 31న ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు అవకాశం కలిగింది. ఈయూ నుంచి వేరుపడ్తున్న తొలి దేశంగా బ్రిటన్ నిలవనుంది. ఇక బ్రెగ్జిట్ బిల్లు హౌజ్ ఆఫ్ లార్డ్స్, యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది.
క్రొయేషియా అధ్యక్ష ఎన్నికల్లో మిలనోవిక్ విజయం
క్రొయేషియా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో క్రొయేషియా మాజీ ప్రధాని, సోషల్ డెమోక్రట్ పార్టీ నేత జోరన్ మిలనోవిక్ విజయం సాధించారు. 2020 జనవరి 6న వెల్లడైన ఫలితాల ప్రకారం.. మిలనోవిక్కు 52.7 శాతం ఓట్లు వచ్చాయి. ఆయన సమీప రాజకీయ ప్రత్యర్థి, సిట్టింగ్ ప్రెసిడెంట్ కొలిండా గ్రాబర్ కిటారోవిక్కు 47.3శాతం ఓట్లు వచ్చాయి. మితవాద భావజాలమున్న కిటారోవిక్ కన్జర్వేటివ్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 40 లక్షలకు పైగా జనాభా కలిగిన క్రొయేషియా 1991లో స్వతంత్య్ర రాజ్యంగా ఆవిర్భవించింది.
ఆస్ట్రేలియాలో పదివేల ఒంటెల కాల్చివేత
ఆస్ట్రేలియాలో విపరీత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశ దక్షిణ ప్రాంతంలో కరువు కరాళ నత్యం చేస్తోంది. కరువు నెలకొన్న ప్రాంతంలో ఒంటెల సంఖ్య అధికంగా ఉంది. ఇవి అధికంగా నీరు తాగుతున్నాయి. దీని కారణంగా కరువు ప్రాంతంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పదివేల ఒంటెలను కాల్చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. శిక్షణ పొందిన షూటర్లతో హెలికాప్టర్ల నుంచి కాల్చడం ద్వారా ఒంటెల సామూహిక హనన కార్యక్రమం చేపట్టనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాను కార్చిచ్చు అతలాకుతలం చేస్తోంది. ఈ కార్చిచ్చు కారణంగా కంగారూలు, కోలాలు, అడవి గొర్రెలు, వివిధ రకాల పక్షులు లక్షలాదిగా ప్రాణాలు కోల్పోయాయి.
వ్యూహాత్మక అంశాలపై ట్రంప్, మోడీ చర్చలు
అమెరికా-భారత్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడంతో పాటు, ప్రాంతీయ భద్రతా వ్యవహారా లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోడీ ఫోన్లో చర్చించారు. ఈ విషయాన్ని 2020 జనవరి 6న వైట్హౌజ్ వెల్లడించింది. భారత్తో ద్వైపాక్షిక అంశాలను బలోపేతం చేసేందుకు మరింత కషి చేస్తానని ట్రంప్ చెప్పినట్లు పేర్కొంది. ట్రంప్-మోడీల ఫోన్ కాల్పై ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) కూడా స్పందించింది. అమెరికా-భారత్ మైత్రి బలపడటమే గాక, ఇరు దేశాల ప్రయోజనాల దష్ట్యా కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోడీ పేర్కొన్నారని తెలిపింది. వీరిరువురి ఫోన్ కాల్కు ముందు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో జనవరి 5న ఫోన్లో మాట్లాడారు.
పాకిస్థాన్లో హర్ గోవింద్ ఖొరానా పరిశోధక విభాగం
ప్రఖ్యాత భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త హర్ గోవింద్ ఖొరానా పేరుతో పాకిస్థాన్లో పరిశోధక విభాగం ఏర్పాటు కానుంది. ఖొరానా పేరిట ప్రత్యేక పరిశోధక విభాగాన్ని (రీసెర్చ్ చైర్) ఏర్పాటు చేయనున్నట్లు లాహౌర్లోని గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ (జీసీయూ) 2020 జనవరి 9న ప్రకటించింది. ఖొరానా 1922లో అవిభక్త భారత్లోని రారుపుర్ గ్రామం (ప్రస్తుతం పాక్లో ఉంది)లో జన్మించారు. 1968లో వైద్యరంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.
జమ్మూకశ్మీర్లో 15 దేశాల రాయబారులు
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ సహా భారత్లోని 15 దేశాల రాయబారులు 2020 జనవరి 9న పర్యటించారు. బంగ్లాదేశ్, వియత్నాం, నార్వే, మాల్దీవ్స్, దక్షిణ కొరియా, మొరాకొ, నైజీరియా తదితర దేశాల రాయబారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్లో పరిస్థితిని క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కొందరు రాజకీయ నేతలు, సైన్యాధికారులు, పౌరసమాజ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారికి లెఫ్ట్నెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ కశ్మీర్ పరిస్థితులను వివరించారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లఢాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు.
ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఎకనమిక్ నివేదిక విడుదల
ప్రపంచ బ్యాంక్ జనవరి 9న ''గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్'' పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ, అభివద్ధి, భారత జీడీపీ వద్ధిరేటుకి సంబంధిం చిన అంశాలను ఈ నివేదికలో ప్రస్తావించింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వద్ధిరేటు 5 శాతానికి పడిపోయే అవకాశం ఉందని, 2020-2021లో వద్ధిరేటు 5.8 శాతానికి రికవరీ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
జాతీయం
పౌరసత్వ సవరణ చట్టం అమలు ప్రారంభం
పౌరసత్వ సవరణ చట్టంను కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి 10 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు హౌం శాఖ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లో మత పీడనకు గురై.. 2014 డిసెంబరు 31కి ముందు భారత్కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను అక్రమ వలసదారులుగా పరిగణించకుండా, వారికి పౌరసత్వం కల్పించేందుకుగాను పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. 2019 డిసెంబరు 10న లోక్సభలో, డిసెంబరు 11న రాజ్యసభలో దానికి ఆమోదం లభించింది. 2019 డిసెంబరు 12న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో బిల్లు చట్టరూపం దాల్చింది.
బొగ్గు గనుల చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
గనులు, ఖనిజాలు (అభివద్ధి, నియంత్రణ) చట్టం-1957, బొగ్గు గనులు (స్పెషల్ ప్రొవిజన్స్) చట్టం-2015లో సవరణలు చేస్తూ రూపొందించిన ప్రత్యేక ఆర్డినెన్స్కు కేంద్ర కేబినెట్ 2020 జనవరి 8న ఆమోదం తెలిపింది. దీంతో బొగ్గుయేతర సంస్థలు కూడా బొగ్గు గనుల బిడ్డింగ్లో పాల్గొనవచ్చు. అలాగే, అంతిమంగా బొగ్గు వినియోగంపైనా ఆంక్షలు ఉండవు. వాణిజ్య అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తి చేసేందుకు 2018లో ప్రైవేట్ కంపెనీలకూ అనుమతిని ఇచ్చినప్పటికీ.. బొగ్గు పరిశ్రమయేతర సంస్థలను వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించలేదు.
లోక్పాల్ పదవికి జస్టిస్ దిలీప్ రాజీనామా
లోక్పాల్ సభ్యత్వ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జస్టిస్ దిలీప్ బి.బొసాలే 2020 జనవరి 9న వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2020, జనవరి 12 నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని చెప్పారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ దిలీప్ 2019 మార్చి 27న లోక్పాల్ జ్యుడీషియల్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్పాల్ సభ్యులుగా ఎంపికైన వారి పదవీకాలం ఐదేళ్ల పాటు లేదా 70 ఏళ్ల వయసు వరకు కొనసాగనుంది.
శబరిమలపై ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు
శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం, ముస్లిం, పార్సీ మతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతత్వంలో 9 మంది జడ్జీలు 2020, జనవరి 13 నుంచి ఆయా వ్యవహారాలపై వాదనలు విననుందని జనవరి 7న సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎంఎం శంతనగౌడర్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఆర్ఎస్రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్లు ఉన్నారు. శబరిమల అంశంపై గతంలో వాదనలు విన్న ఏ న్యాయమూర్తి తాజాగా ఏర్పాటైన ధర్మాసనంలో లేరు.
జపాన్ పాస్పోర్టుతో 191 దేశాల పర్యటనకు అవకాశం
జపాన్ పాస్పోర్టు కలిగి వున్న పౌరులు వీసాలు లేకుండా 191 దేశాలు చుట్టి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని హెల్లీ పాస్పోర్టు ఇండెక్స్ (హెచ్పీఐ) జనవరి 9వ తేదీన వెల్లడించింది. హెచ్పీఐ తాజాగా విడుదల చేసిన నివేదికలోని వివరాల ప్రకారం పాస్పోర్టులకు డిమాండ్ ఉన్న దేశాల జాబితాలో జపాన్ అగ్రస్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో సింగపూర్, తతీయ స్థానంలో జర్మనీ, దక్షిణ కొరియా దేశాల పాస్పోర్టులు ఉన్నాయి. గత మూడేండ్ల నుంచి జపాన్ తొలిస్థానంలోనే కొనసాగుతూ వస్తుంది. అమెరికా, బ్రిటన్, నార్వే, గ్రీస్, బెల్జియం దేశాల పాస్పోర్టులు 8వ స్థానంలో ఉన్నాయి. 10ఏండ్ల కిందట బ్రిటన్ తొలిస్థానంలో నిలిచింది. క్రమక్రమంగా దీని స్థానం 8కు పడిపోయింది. అప్పట్లో బ్రిటన్ పాస్పోర్టు ఉన్నవారు 166 దేశాలు సందర్శించే అవకాశం ఉండేది. భారతీయ పాస్పోర్టు ఉన్నవారు 58 దేశాలకు వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ ర్యాంకింగ్లో భారత్ 84వ స్థానంలో నిలిచింది. మౌరిటేనియా, తజికిస్తాన్ దేశాలు కూడా 84వ స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్ పాస్పోర్టు కల్గివున్నవారు 32 దేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.
నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై డెత్ వారెంట్లు
నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులను 2020 జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జనవరి 7న డెత్ వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా కోర్టు హాలులో డెత్ వారెంట్ను చదివి వినిపించారు. నిర్భయ కేసులో దోషులైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినరు శర్మ (26), అక్షరు కుమార్ ఠాకూర్ (31)లకు డెత్ వారెంట్లు జారీ చేయాలంటూ నిర్భయ తల్లిదండ్రులు, ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ అనంతరం ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఖనిజ చట్టాల సవరణకు కేంద్రం ఆమోదం
దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఖనిజ చట్టాలను మారు స్తున్నది. జనవరి 8న ప్రధాని మోడీ నేతత్వంలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గనులు, ఖనిజాల (అభివద్ధి, నియంత్రణ) చట్టం 1957, బొగ్గు గనులు (స్పెషల్ ప్రొవిజన్స్) చట్టం 2015లను సవరిస్తూ ఖనిజ చట్టాల సవరణ ఆర్డినెన్స్ 2020 జారీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం బొగ్గు గనుల వేలంలో బొగ్గు తవ్వకాలు చేస్తున్న సంస్థలే పాల్గొనాలి. దీంతో నిర్దేశిత సూచనలను పాటించిన ఏ సంస్థ అయినా బొగ్గు గనుల కోసం బిడ్లను దాఖలు చేయవచ్చు. సవరించిన నిబంధ నల ప్రకారం ఈ నెలలోనే తొలి వేలం నిర్వహించనున్నారు.
2018 లో1.3శాతం పెరిగిన నేరాలు
దేశవ్యాప్తంగా 2018 సంవత్సరంలో చోటుచేసుకున్న పలు రకాల నేరాలపై జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సిఆర్బి) తన నివేదికను విడుదల చేసింది. అందులో ఏడాదిలో రోజుకు సగటున 80 హత్యలు, 289 కిడ్నాప్లు, 91 అత్యాచారాలు జరిగాయి. అవి మొత్తం 50,74,634 గుర్తింపదగిన (కాగ్నిజబుల్) నేరాలు జరగగా, అందులో 31,32,954 నేరాలు భారతీయ శిక్షాస్మ తి నియమావళి (ఐపిసి) లోని పలు సెక్షన్ల కింద నమోదు అయ్యాయి. మిగిలిన 19,41,680 కేసులు ప్రత్యేక, స్థానిక చట్టాల కింద నమోదయ్యాయి. ఇక్కడ 'కాగ్నిజబుల్' క్రైమ్స్ అంటే ఒక పోలీసుస్టేషన్కు చెందిన అధికారి మెజిస్రేట్ అనుమతి లేకుండానే విచారణ చేయగల లేదా ఎటువంటి వారెంట్ లేకుండానే అరెస్టు చేసే అవకాశం ఉన్న కేసులు అని అర్ధం. అందులో హత్యలు 29,017 హత్యలు జరిగాయి. వీటిల్లో 3,875 కేసుల్లో వ్యక్తిగత కక్షలు వల్లనే జరిగాయి. కిడ్నాప్, అపహరణ కేసు నమోదుల్లో 2017తో పోల్చుకుంటే 10.3 శాతం పెరుగుదల కనిపించింది. అంటే 1,05,734 ఈ విధమైన ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయి. కిడ్నాప్ అయిన వారిలో 80,871 మంది మహిళలు, 63,356 మంది చిన్నారులు ఉన్నారు. మహిళలపై జరిగిన నేరాలకు 3,78,277 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఐపిసి సెక్షన్ 376 ప్రకారం నమోదైన అత్యాచార కేసులు 33,356 ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే 2017తో పోల్చుకుంటే 2018లో నేరాల సంఖ్య 1.3 శాతం పెరిగాయి.
ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్
బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగు తున్న 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో భాగంగా ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభమైంది. భారత వ్యవసాయ పరిశోధనల సమాఖ్య (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర 2020 జనవరి 6న ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్ను ప్రారంభించారు.
సీఏఐటీ సమావేశంలో నిర్మలా సీతారామన్
అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) 2020 జనవరి 7న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. పన్నుల వ్యవస్థను సులభతరంగా మార్చేందుకు, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి వేధింపుల్లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. జీఎస్టీ రిటర్నుల దాఖలును మరింత మెరుగ్గా మార్చే దిశగా సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
హైదరాబాద్లో 'రాజకీయాల్లో ధనబలం' అంశంపై సదస్సు
హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) ప్రాంగణంలో 2020 జనవరి 9, 10 తేదీల్లో 'రాజకీయాల్లో ధనబలం' (మనీ పవర్ ఇన్ పాలిటిక్స్) అంశంపై సదస్సును నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్, ఐఎస్బీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సును ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభించారు.
కిర్లోస్కర్ జీవిత కథ 'యాంత్రిక్ కి యాత్ర' ఆవిష్కరణ
కిర్లోస్కర్ బ్రదర్స్ సంస్థ వ్యవస్థాపకుడు లక్ష్మణ్రావ్ కిర్లోస్కర్ జీవిత కధ 'యాంత్రిక్ కి యాత్ర' హిందీ వెర్షన్ను, కిర్లోస్కర్ బ్రదర్స్ 100 సం||లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన పోస్టల్ స్టాంపును ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో 2020 జనవరి 6న జరిగిన కిర్లోస్కర్ బ్రదర్స్ వందో వార్షికోత్సవ కార్యక్రమంలో మోదీ వీటిని ఆవిష్కరించారు.
'మై టైమ్ ఎట్ సెబీ' పుస్తకం విడుదల
మాజీ ఐఏఎఫ్ ఆఫీసర్, సెబీ మాజీ చైర్మన్ యు.కె. సిన్హా రచించిన 'గోయింగ్ పబ్లిక్: మై టైమ్ ఎట్ సెబీ' పుస్తకం విడుదలైంది. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. నియంత్రణ సంస్థలు సొంత ఆదాయ వనరులను కలిగి ఉండా లని, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లపై ఆధారపడ కూడదని సిన్హా తన పుస్తకంలో పేర్కొన్నారు. ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థ కార్యకలాపాలకు ఆర్థిక స్వాతంత్య్రం ప్రాథమిక అవసరమని వివరించారు.
భారత్ బంగ్లా మధ్య ఫెన్సింగ్
బంగ్లాదేశీయుల చొర బాట్లను నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసు కోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించు కుంది. అందుకే కత్తిరించడానికి, తొలగించ డానికి వీలులేని విధంగా అత్యాధునిక కంచెను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఇటువంటి కంచెను లాఠిటిలా సిల్చార్ సెక్టర్ వద్ద నిర్మిస్తున్నారు. 7.18 కిలోమీటర్ల పొడవున రూ.14.30 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇటువంటి కంచెనే భారత్ - పాక్ సరిహద్దుల్లోనూ మారుస్తున్నారు. కశ్మీరు లోయలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం సుమారు 300 మందిని పాకిస్తాన్ సిద్ధంగా ఉంచినట్టు, ఆఫ్ఘనిస్థాన్, తాలిబన్ ఉగ్రవాదులు కూడా వీరిలో ఉన్నట్లు సమాచారం.
31 ప్రశ్నలతో జనాభా లెక్కలు
2020లో జనగణన ప్రారంభానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గణన సమయంలో ఏయే అంశాలు పరిగణలోకి తీసుకోవాలనే దానిపై పూర్తిగా సన్నద్ధమవుతున్నారు. ఇందులో దాదాపు 31 అంశాలు ఉంటాయని, కుటుంబ పెద్ద మొబైల్ నెంబర్ నుంచి ఇంట్లో ఉన్న టాయిలెట్లు, టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్స్, సొంత వాహనాలు, కంప్యూటర్, ల్యాప్టాప్, తాగునీటి వసతి, కుటుంబ పెద్ద ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతర ఏ సామాజిక వర్గానికి చెందుతారనే వివరాలూ సేకరిస్తారు. ఇల్లు సొంతమా? ఇంట్లోని గదులెన్ని? ముఖ్యమైన ఆహారం ఏమిటి? వంటకు వాడే ఇంధనం ఏమిటి? తదితర సమాచారాన్ని ఎన్యూమరేటర్లు (సమాచారం కోసం వచ్చే ఉద్యోగులు) సేకరిస్తారు. ఏప్రిల్ 1-సెప్టెంబర్ 30 మధ్యలో కుటుంబ సమాచార సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. అంతేకాదు ఈ సారి వివరాలన్నింటినీ మొబైల్ యాప్లో నిక్షిప్తం చేస్తారు. జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)నూ రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది.
కేరళలోని పట్టణాలు అభివృద్ధిలో ముందంజ : ఈఐయూ
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఎకనామిస్టు ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఒక జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో టాప్ 10లో భారత్కు చెందిన మూడు ప్రాంతాలు ఉన్నాయి. అవి కూడా కేరళకు చెందిన మలప్పురం, కోజికోడ్, కొల్లాం పట్టణాలు. ఇందులో మలప్పురం అగ్రస్థానంలో ఉంది. కేరళలోని మరో పట్టణం త్రిస్సూర్ 13వ స్థానంలో ఉండగా, గుజరాత్కు చెందిన సూరత్ 26వ స్థానంలో, తమిళనాడు లోని తిరుప్పూర్ 30వ స్థానంలో నిలిచాయి. టాప్ 10 జాబితాలో చైనాకు చెందిన మూడు పట్టణాలు, నైజీరియా, ఒమన్, యుఎఇ, వియత్నాంలకు చెందిన ఒక్కో పట్టణం చొప్పున ఉన్నాయి.
ప్రాంతీయం
స్వచ్ఛత దర్పణ్లో 'పెద్దపల్లి'కి పురస్కారం
పల్లెల్లో సంపూర్ణ పారిశుధ్యం మెరుగు పరిచి పరిసరాల పరిశుభ్రత పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛత దర్పణ్-2020 పురస్కారాల్లో పెద్దపల్లి జిల్లాకు చోటు దక్కింది. జిల్లాలో ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడుగుంత, పంచాయతీకొక సామూహిక శౌచాలయం నిర్మించడంతో పాటు వాటికి జియోట్యాగింగ్ పూర్తి చేశారు.
తొలిసారి థర్మల్, సౌర విద్యుదుత్పత్తి చేసిన బొగ్గు కంపెనీ సింగరేణి
దేశంలోనే తొలిసారి థర్మల్, సౌర విద్యుదుత్పత్తి రంగం లోకి అడుగుపెట్టిన బొగ్గు కంపెనీగా సింగరేణి నిలిచింది. మంచిర్యాల జిల్లా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో నిర్మించిన 5 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంటులో 2020 జనవరి 10న ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించి గ్రిడ్కు సరఫరా చేశారు.
విద్యుదాఘాత మరణాల్లో తెలంగాణకు 5వ స్థానం
విద్యుదాఘాత మరణాల్లో తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్.సి.ఆర్.బి.) 2018 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన నివేదికలో అనేక రకాల ప్రమాదాలు, వాటి ద్వారా సంభవించిన మరణాలను ప్రస్తావించింది. విద్యుదాఘాత మరణాల్లో తెలంగాణ రాష్ట్రం 5వ స్థానంలో ఉండగా, 2243 మరణాలతో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర(1433) 3వ, ఉత్తర్ప్రదేశ్ (1117) 4వ, రాజస్థాన్(1026) 5వ స్థానాల్లో నిలిచాయి. మ్యాన్హౌల్లో పడి చనిపోయింది ముగ్గురే అయినా ఇందులోనూ తెలంగాణ 5వ స్థానంలో ఉంది. మిగతా అన్ని ప్రమాదాల్లో మహిళల కంటే పురుషులే ఎక్కువగా చనిపోతుండగా.. అగ్నిప్రమాదాలు, గ్యాస్ సిలిండర్ లేదా స్టౌ పేలడం వంటి వాటిలో మాత్రం మహిళలు ఎక్కువగా చనిపోతున్నారు. 2018లో అగ్నిప్రమాదాల కారణంగా మొత్తం 145 మంది చనిపోగా వీటిలో పురుషులు 39 మంది, స్త్రీలు 106 మంది ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బయటకు రాలేక మహిళలు ఎక్కువగా మరణిస్తున్నారని తెలుస్తోంది.
న్యూజిలాండ్ పార్లమెంటరీ కార్యదర్శితో కేటీఆర్ భేటీ
న్యూజిలాండ్ ఎత్నిక్ ఎఫైర్స్ శాఖ పార్లమెంటరీ కార్యదర్శి ప్రియాంక రాధాక్రిష్ణన్తో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ప్రగతిభవన్లో 2020 జనవరి 8న జరిగిన ఈ సమావేశంలో న్యూజిలాండ్, తెలంగాణలో రాజకీయ వ్యవస్థల పనితీరుపై ఇరువురు చర్చించారు.
ఆర్థికాంశాలు
జీడీపీ వద్ధి 5 శాతం లోపే : ఎన్ఎస్ఓ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వద్ధి రేటు 5 శాతం దిగువనే నమోదవు తుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) అంచనా వేసింది. ఈ మేరకు 2020 జనవరి 7న జాతీయ ఆదాయ తొలి ముందస్తు అంచనాలను వెలువరిం చింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వద్ధిరేటు 6.8 శాతంగా నమోదైంది. జీడీపీ వద్ధిరేటు 5 శాతం దిగువకు పడిపోతే అది 11 సంవత్సరాల కనిష్ట స్థాయి అవుతుంది.
సైన్స్ & టెక్నాలజీ
చిత్రదుర్గ జిల్లాలో గగన్యాన్ శిక్షణ కేంద్రం
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లెకెరెలో గగన్యాన్ ప్రాజెక్టు కోసం అదనపు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2020 జనవరి 6న వెల్లడించింది. 'హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్'గా పిలిచే ఈ కేంద్రం నుంచి గగన్యాన్కు సంబంధించిన కార్యక్రమాలతో పాటు వ్యోమ గాములకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. గగన్యాన్ ద్వారా 2022 నాటికి ముగ్గురు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే 2022 నాటికి లేదా అంతకంటే ముందే సొంత సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయుడిని అంతరిక్షంలోకి పంపుతామని 2018, ఆగస్టు 15న ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించాడు.
కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో-2020
అమెరికాలోని లాస్ వెగాస్లో 2020 జనవరి 7న '2020 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)' ప్రారంభమైంది. పలు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు తమ కొత్త ఉత్పత్తులను సీఈఎస్లో ప్రదర్శనకు ఉంచాయి. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్ సీఈఎస్లో కత్రిమ మేథతో (ఏఐ)తో పనిచేసే 'డిజిటల్ మనిషి' (డిజిటల్ అవతార్)ని ఆవిష్కరించింది. హాలీవుడ్ సినిమా అవతార్ ప్రేరణతో రూపొందించిన ఏవీటీఆర్ కాన్సెప్ట్ కారును మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించింది. దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ హ్యుందారు కొత్తగా రూపొందిస్తున్న ఎయిర్ ట్యాక్సీలను ఎస్-ఏ1 పేరిట ఆవిష్కరించింది.
డీఎఫ్ఆర్ఎల్లో వ్యోమగాముల ఆహారం తయారు
ఇస్రో 2020 ఏడాది చేపట్టనున్న గగన్యాన్ ప్రయోగంలో అంతరిక్షం లోకి వెళ్లే వ్యోమగాముల కోసం మైసూరుకు చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎఫ్ఆర్ఎల్) పలు రకాల ఆహార పదార్థాలను సిద్ధం చేయనుంది. ఇస్రో, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వంటకాలు తయారు చేయనుంది. ఇడ్లీ సాంబార్, ఎగ్ రోల్స్, వెజ్ రోల్స్, వెజ్ పులావ్తో పాటు మాంసాహారాన్ని వండిపెట్టనుంది. 32 ఆహార పదార్థాల జాబితాను ఇస్రోకు పంపించింది. ఈ ఆహారాలు కొన్ని నెలల పాటు పాడవకుండా, తాజాగా, పోషకాలతో ఉంటాయని డీఎప్ఆర్ఎల్ తెలిపింది.
క్రీడాంశాలు
ఖేలో ఇండియా క్రీడలు
ఖేలో ఇండియా యూత్ క్రీడలు 2020 జనవరి 10న గౌహతిలో ప్రారంభమయ్యాయి. కేంద్ర క్రీడల మంత్రి కిరెన్ రిజిజు, అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ పోటీలను ప్రారంభించారు.
మగేశ్ చంద్రన్కు హేస్టింగ్స్ చెస్ టైటిల్
ఇంగ్లండ్లోని హేస్టింగ్స్ వేదికగా 95వ 'హేస్టింగ్స్ ఇంటర్నే షనల్ చెస్' టోర్నీలో తమిళనాడుకు చెందిన గ్రాండ్ మాస్టర్ మగేశ్ చంద్రన్ టైటిల్ గెలుచుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి మగేశ్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రొమైన్ ఎడ్యుర్డ్ (ఫ్రాన్స్) 7 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, 6.5 పాయింట్లు సాధించిన మరో నలుగురు క్రీడాకారులు మూడో స్థానం పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న మగేశ్ టోర్నీలో అజేయంగా నిలిచాడు. మొత్తం తొమ్మిది రౌండ్లలో 6 గెలిచి, 3 డ్రా చేసుకున్నాడు.
టోక్యో ఒలింపిక్స్కు హార్స్ రైడర్ మీర్జా
2020 టోక్యో ఒలింపిక్స్ ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడలు) ఈవెంట్లో భారత హార్స్ రైడర్ ఫౌద్ మీర్జా అర్హత సాధించాడు. ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ప్రకటించిన ర్యాంకింగ్స్ ప్రకారం ఫౌద్ మీర్జా టోక్యో ఒలింపిక్స్కు అధికారికంగా బెర్త్ ఖాయం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ కోసం 2019 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 మధ్య కాలంలో కనబరిచిన ప్రదర్శనను లెక్కలోకి తీసుకున్నారు. ఫౌద్ మీర్జా కంటే ముందు భారత్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఒలింపిక్స్ ఈక్వెస్ట్రియన్ ఈవెంట్లో పాల్గొన్నారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్లో ఇంతి యాజ్ అనీస్... 1996 అట్లాంటా ఒలింపిక్స్లో ఐజే లాంబా భారత్ తరపున ఈక్వెస్ట్రియన్ ఈవెంట్లో బరిలోకి దిగారు.
వెయిట్లిఫ్టర్ సరబ్జిత్పై నాలుగేళ్ల నిషేధం
భారత మహిళా వెయిట్లిఫ్టర్ సరబ్జిత్ కౌర్ (71 కేజీలు)పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో 2020 జనవరి 8న ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో జరిగిన మహిళల సీనియర్ జాతీయ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ సందర్భంగా ఆమె నుంచి రక్త, మూత్ర నమూనాల్ని సేకరించి పరీక్షించారు. ఇందులో నిషేధిత ఉత్ప్రేరకాలను సరబ్జిత్ తీసుకున్నట్లు తేలింది.
మలేసియా మాస్టర్స్లో ముగిసిన సింధు పోరాటం
కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేసియా మాస్టర్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. టోర్నీలో భాగంగా జనవరి 10న జరిగిన మహిళల సింగిల్స్లో ఆరో సీడ్ పీవీ సింధు 16-21, 17-21తేడాతో వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత క్వార్టర్ ఫైనల్కు చేరుకున్న పీవీ సింధు మరోసారి ఓడిపోయింది. ప్రారంభం నుండి చివరి వరకు తై జు యింగ్ పూర్తిగా పై చేయిలో ఉంది. వీరిద్దరూ ఇప్పటివరకు 17సార్లు తలపడగా సింధు 12సార్లు ఓడిపోయింది. అయితే, సింధుపై తై జు యింగ్కు ఇది వరుసగా రెండో విజయం.