Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి అంత మంచిదని మనకు తెలుసు. కానీ గోరువెచ్చని నీటిని ఎక్కువగా తాగడం వల్ల కలిగే లాభాలు అంతకన్నా ఎక్కువేనట. ఇంతకీ ఆ అవేంటంటే...
- ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే కొవ్వును కరిగించడంలోనూ దీని పాత్ర ముఖ్యమైందే. బరువు తగ్గాలనుకునే వారు ఈ నీటిని తాగడం మంచిది.
- కడుపు నొప్పీ, తలనొప్పులతో బాధపడుతున్నప్పుడు గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది.
- జలుబూ, గొంతునొప్పి ఉన్నప్పుడు మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడమూ కష్టమే. అలాంటప్పుడు గోరువెచ్చని నీరు తాగి చూడండి. ఫలితం కనిపిస్తుంది.
మాడుకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే గోరువెచ్చని నీరు తాగడమే సరైన పరిష్కారం.
- ఈ గోరువెచ్చటి నీటికి కాస్త నిమ్మరసాన్ని కలిపి తాగితే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
నెలసరి సమయంలో పొత్తి కడుపులో వచ్చే నొప్పిని నివారించడంలోనూ గోరువెచ్చని నీళ్లు బాగా పనిచేస్తాయి.
- కాస్త వేడిగా ఉన్న నీళ్లు తాగడం వల్ల ఒంట్లో ఉష్ణోగ్రత పెరిగి చెమట ఎక్కువగా వస్తుంది. దీని ద్వారా ఎక్కువ క్రిములు బయటికి పోయే అవకాశం ఉంటుంది.
- క్రమం తప్పకుండా గోరువెచ్చని నీళ్లే తాగడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వద్ధాప్యఛాయలూ త్వరగా మొదలుకావు.