Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోపుకు ఉపయోగించే ఆవాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం...
- శీతాకాలంలో గొంతునొప్పి, దగ్గు జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపోడి, తగినంత తేనె వేసి ఇస్తే ఉపశమనం లభిస్తుంది.
- ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే మైగ్రేన్ తలనొప్పి కూడా పోతుంది.
- ఆవాలు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి.
- కీళ్ల నొప్పులతో బాధపడేవారు.. ఆవాల పేస్టును, కర్పూరంతో కలిపి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- ఎక్కువగా వాంతులు, నీళ్ల విరేచనాలవుతుంటే.. ఆవాల పొడిని కడుపు భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
- చర్మంపై ఏర్పడే పులిపిర్లను ఆవపొడి తొలగిస్తుంది. ఆవ పొడిని మెత్తని మిశ్రమం చేసి దాన్ని పులిపిర్లపై రాయడం ద్వారా అవి ఎండిపోయి రాలిపోతాయి.
- శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టి కొవ్వును తగ్గించే గుణం ఆవాలకి ఉంది.
పంటి నొప్పి బాధపెడుతుంటే గోరువెచ్చటి నీటిలో ఆవాలు వేసి కాసేపటి తర్వాత ఆ నీటిని పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుంది.