Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరాలు మారిపోతున్నాయి. దాంతో పాటు వారి స్వరాలు మారుతున్నాయి. ఇప్పటి జనరేషన్ పుట్టుకతో వృద్ధులు కాదు. వారంతా చాలా స్మార్ట్, సో స్మార్ట్. గత తరాలతో పోలిస్తే వారికి సామాజిక బాధ్యత ఎక్కువగా ఉంటుంది. సమాచార విప్లవం వారిలో కొత్త ఆలోచనలకు పదును పెడుతుంది. నేటి యువతలో నైపుణ్యం కరువైపోతుందని ఆందోళనలు ఒకవైపు నెలకొన్నప్పటికీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక వారి శక్తి సామర్ధ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేస్తూ సమాజానికి తమ వంతు సేవ చేస్తున్నారు. యువత అత్యధికంగా ఉన్న జనాభాలో ప్రపంచంలోనే ఇప్పుడు భారత్ నంబర్ వన్. 130 కోట్ల మంది ఉన్న మన దేశ జనాభాలో 35 ఏళ్లలోపు వయసున్న వారు 65 శాతం వరకు ఉన్నారు. దేశ ఉత్పాదక శక్తిలో కీలక భూమిక వీరిదే. ఇక 2012 తర్వాత పుట్టిన వారు జనరేషన్ అల్ఫా స్మార్ట్ ఫోన్ చేతుల్లో పట్టుకొని పుడుతున్నారు. అరచేతుల్లోనే కొత్త ప్రపంచంలోకి తొంగి చూస్తున్నారు. సమాజానికి పనికి వచ్చే ఆవిష్కరణలూ చేస్తున్నారు. శాస్త్ర విజ్ఞానంపై అవగాహన పెంచుకుంటూ హేతుబద్దంగా ఆలోచనలు చేస్తున్నారు. చేతిలో ఫోన్నే పాఠశాలగా మార్చుకొని ప్రపంచ విషయాలను అర్థం చేసుకుంటున్నారు.