Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొప్పాయికాయలో ఉండే 'పపైన్' అనే ఎంజైమ్ జీర్ణ సంబంధమైన అనారోగ్యాలను నయం చేస్తుంది.
- పచ్చిమామిడికాయ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ ముక్కలను ఉప్పులో ముంచుకొని తింటూంటే వేసవిలో అనారోగ్యాలు, అతిదాహం, అలసట, మానసిక చికాకులు తగ్గుతాయి.
- ఖర్ఖూరపు కాయ పెచ్చును పాలలో ఉడికించి, ఆ పాలు తాగితే గొంతు బొంగురు ఉంటే తగ్గిపోయి, మాట మధురంగా స్పష్టంగా పలుకుతుంది.
- పండిత చింతకాయను నీటిలో కలిపి ముద్దగా చేసి పంచదార కలిపి తాగితే వడదెబ్బ నుండి విముక్తి లభిస్తుంది.
- కీరదోస రసం తాగితే గుండెలో మంట, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి.
- రెండు నిమ్మకాయల రసాన్ని గోరు వెచ్చని నీళ్ళలో కలిపి తాగితే మలబద్ధకం నివారించబడి ఆరోగ్యం చేకూరు తుంది. స్థూలకాయం తగ్గి, సన్నగా నాజూగ్గా అవుతారు. నన