Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకుంటే చాలు. ఆ ఆహారమే మహా ఔషధమై మనలో అన్ని సమస్యలనీ దూరం చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటే ఎలాంటి సమస్యలు రావు. అందుకే ముందుగా మనం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు ఏ ఆహారం తీసుకోవాలో తెలుసు..
- ఆయాసం, దగ్గు, కఫంతో బాధపడేవారు అరచెంచా తేనెను వేడి నీటిలో కలుపుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. ఇలా రోజుకి మూడు నుంచి నాలుగుసార్లు చేయాలి.
- అజీర్ణం వల్ల కడుపునొప్పి వస్తే అరకప్పు గోరు వెచ్చని నీటిలో రెండు చెంచాల తేనె, చెంచా వేయించిన వాము వేసి తాగండి. ఇలా తాగితే అజీర్ణం, కడుపునొప్పి తాగుతాయి.
- గోరు వెచ్చని నీటిలో అరచెంచా తేనె వేసుకుని పుక్కిలించండి.. ఇలా చేయడం వల్ల గొంతునొప్పి, చిగుళ్ళ వాపు తగ్గుతుంది.
- పాటు కాఫీ, టీలకు బదులు గ్రీన్ టీలో కొద్దిగా తేనె వేసుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల మరో లాభం ఏంటంటే.. కొలెస్ట్రాల్ తగ్గి లావు కూడా తగ్గుతారు.
- కరోనా, జ్వరం, జలుబు, దగ్గు, వైరస్లు ఇలా ఏ సమస్యలైనా సరే.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటేనే మనపై దాడి చేస్తాయి. అందుకే మనలో ఆ సమస్య లేకుండా ముందుగా జాగ్రత్త పడాలి. అందు కోసం సరైన ఆహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం, ఆహారం తాజాగా వండుకుని ఆ ఆహారాన్నే తీసుకోవడం లాంటివి చేయాలి. నన