Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కండ్ల కింద నల్ల మచ్చలను తొలగించేందుకు ఆలు భలే పనిచేస్తుంది. బంగాళ దుంపలను గుండ్రంగా తరగాలి. వాటిని కాసేపు ఫ్రిజ్లో పెట్టాలి. తరువాత వాటిని కండ్ల కింద పెట్టుకోవాలి. రోజూ చేస్తే నల్లమచ్చలు మాయమవుతాయి.
- ఆలుగడ్డని మిక్సీలో వేసి ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే చర్మం మదువుగా మారి, ఛాయ పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డు కూడా తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది.
- బంగాళాదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేస్తే చర్మం రంగు తేలుతుంది.
- స్పూను ఆలుగడ్డ రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పూసుకుని కాసేపు ఆరనీయాలి. ముందు గోరువెచ్చటి నీటితోనూ, తరవాత చన్నీటితోనూ కడిగేయాలి.
- ఆలుగడ్డను ఉడకబెట్టి ముద్దలా చేసి, ఒక స్పూను పాల పొడి, ఒక స్పూను బాదం నూనె కలిపి ముఖానికి పట్టించి పావుగంట తరవాత శుభ్రపరిస్తే ఛాయ మెరుగుపడుతుంది.
- ఒక ఆలుగడ్డను తురిమి రసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి కోడిగుడ్డు, పెరుగు కలపండి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ల నుంచి మొత్తం వెంటుకలకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగి, షాంపుతో తలంటుకోండి. మీ జట్టుకు బోలెడంత బలం వస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
- మూడు టేబుల్ స్పూన్ల ఆలూ రసం, మూడు స్పూన్ల కలబంద రసం, రెండు స్పూన్ల తేనె తీసుకోండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే మీ జుట్లు మెరిసిపోతుంది.