Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెల్లగా ఉంటే అందం... నల్లగా ఉంటే అందవిహీనం... అనే ప్రచారం మన దేశంలో ఎన్నో ఏండ్ల నుండి జీర్ణించుకుపోయింది. ఆడపిల్లకు పెండ్లి కావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, ఆత్మవిశ్వాసం పెరగాలన్నా తెల్లగా ఉండాల్సిందే... ఇదే విషయాన్ని టీవీలో ప్రకటనలు నిత్యం హౌరెత్తిస్తున్నాయి. అంతే కాదు రంగు పేరుతో మనుషుల పట్ల వివక్ష... జాత్యహంకారంతో ప్రాణాలు తీయడం నిత్యం చూస్తూనే ఉన్నాం. అందుకే 'బ్లాక్ లైవ్ మేటర్' ఉద్యమం ఇటీవల ఊపందుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో తెల్లటి చర్మం మన జీవితాల్లో ఎంతటి తీవ్ర ప్రభావం చూపుతుందో కొందరు ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
గత నెలలో బహుళజాతి కంపెనీ హిందుస్తాన్ యునిలివర్ లిమిటెడ్ అత్యధికంగా అమ్ముడుపోయే తన ఫెయిర్ అండ్ లవ్లీ పేరులో కొన్ని మార్పులు చేసింది. అందం, తెలుగు, కాంతి అనే పదాలను తొలగించివేసింది. ఈ మార్పు చాలా ఆలస్యంగా వచ్చింది. కోట్లమంది భారతీయ మహిళలు ఈ క్రీమ్ను ఉపయోగిస్తున్నారు. ఫెయిర్ అండ్ లవ్లీ ద్వారా ఆ కంపెనీకి 4,100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే తెలపు అనేది మన మహిళలపై ఎంతటి తీవ్ర ప్రభావం చూపుతుందో ఇట్టే తెలిసిపోతుంది.
అసలు ఇది ఎలా మొదలయిందంటే...
అమెరికాలో రంగు వివక్ష దశాబ్దాలుగా కొనసాగుతుంది. మే నెలలో మిన్నె సోటాలో పోలీసు అధికారుల చేతిలో జాతి వివక్షకు గురై జార్జ్ ఫ్లాయిడ్ మరణించాడు. ఈ సంఘటన రంగు పేరుతో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా 'బ్లాక్ లైవ్ మేటర్ ఉద్యమం'కు దారితీసింది. ఈ వివక్షకు ఫెయిర్నెస్ క్రీముల ప్రభావం కూడా ఎంతో ఉంది. అందుకే ఆ ఉత్పత్తులపై కూడా చర్చ మొదలయింది. ఈ వ్యతిరేకతను గమనించిన 'జాన్సన్ అండ్ జాన్సన్' కంపెనీ దాని లేబుళ్ళలో 'ఫెయిర్నెస్' ని సూచించే రెండు రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను నిలిపేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ తర్వాతరోజే యునిలివర్ కూడా తన ఉత్పత్తుల నుండి తెలుపు, అందం, కాంతి పదాలను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కోల్కతాకు చెందిన 'ఫెయిర్ అండ్ హ్యాండ్స్మ్'ను ఉత్పత్తి చేస్తున్న ఎఫ్ఎంసిజి సంస్థ ఎమామి కూడా ఇదే నిర్ణయం తీసుకుంటుంది. క్రీములు ఈ ఉద్యమంలో ఒక భాగమైతే అసలు మన భారతదేశంలో అందమైన చర్మానికి అత్యంత ప్రాధాన్యం వుంది. తెల్లటి చర్మం ఉంటేనే అందం అని బాగా ప్రచారంలో వుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా వుంది.
అందమైన మనస్తత్వం కావాలి
మన దేశ వాతారణాన్ని బట్టి చర్మం తెలుపు, నలుపు, గోధుమ రంగుల్లో వుంటుంది. తెల్లటి అందమైన చర్మం కావాలనే కోరిక ఇంట్లో బామ్మలు తయారు చేసే సున్నిపిండితో మొదలయింది. అమ్మాయి పెరిగే కొద్దీ ఆ భావన మరీ ఎక్కువ అవుతుంది. రంగు ఆధారంగా మానసిక వేధింపులు కూడా మొదలవుతాయి. ఆ రంగు ఆధారంగానే అమ్మాయి పెండ్లి ఆధారపడి వుంటుంది.
ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు
గర్భం ధరించిన వెంటనే పాలలో కుంకుమపువ్వు కలిపి ఇస్తారు. దాంతో బిడ్డ అందంగా, మంచి రంగుతో పుడుతుం దంటారు. ఓ ప్రటనలో అయితే పెండ్లి చూపుల సమయంలో వధువు తెల్లగా, అందంగా ఉందా లేదా అనే విషయంపైనే ఎంపిక జరుగుతుంది. ఇలాంటి ప్రకటనల వల్ల తెల్లని వారే మనుషులు అనే భావన బాగా పెరిగి పోయింది. రంగు తక్కు వగా ఉన్న మహిళ ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఉంటున్నాయి. ఇది కేవలం మన భారతదేశం లోనే మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా వర్ణ వాదానికి దారితీసింది.
వెంటాడుతూనే వుండేది
కెనడా లోని టొరంటోకు చెందిన తమిళ - కెనడియన్, మేకప్ ఆర్టిస్ట్ అయినా 24 ఏండ్ల షోబియా ఓరుతిరాపతిని హెచ్యుఎల్ సిఇఒకు లేఖ రాసిన సంఘటన ఫెయిర్ అండ్ లవ్లీకి వ్యతిరేకంగా పిటిషన్ వేసేందుకు ప్రేరేపించింది. పిటీషనర్ మాట్లాడుతూ ''వయసు పెరిగేకొద్దీ ఆడపిల్లను బయట ఎక్కువ సమయం గడపొద్దని అంటుంటారు. తెల్లబడటం కోసం క్రీములు వాడమంటారు. రంగు ఆధారంగానే అవకాశాలు వస్తాయనే ప్రచారం చేస్తున్నారు. మా తల్లిదండ్రులు చాలా మంది దక్షిణా సియా దేశాల నుండి వలస రావడంతో పాశ్చాత్య ప్రపంచంలో రంగువాదం కూడా ఒక సమస్య. కొన్ని ప్రకటనలకు ప్రభావితమై నేను కూడా అందం కోసం రెండు మూడు రకాల క్రీములను ఉపయోగించా. అందమైన చర్మం అనే ఒత్తిడి నన్ను ఎప్పుడూ వెంటాడుతుండేది. చాలా కాలం అదే అభద్రతలో గడిపాను.
మార్పు అవసరం
ఇంకా ఆమె మాట్లాడు ''45 ఏండ్ల తర్వాత యునిలివర్ మొదటిసారిగా ఫెయిర్ అండ్ లవ్లీని రీబ్రాండ్ చేయాలని నిర్ణయించుకుంది. చాలా సంతోషంగా ఉంది. ఇది సరైన దిశలో వేస్తున్న మొదటి అడుగు. అన్ని రంగుల మహిళలు సమానం. ఈ భావన నెమ్మదిగా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుత మహిళలకు కలరిజం అనేది ఓ సమస్యగా వుంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేట్లు ఇలాంటి మార్పులు చేయడం చాలా అవసరం.
తారల ప్రభావం
కొంతమంది తారలు ఫెయిర్నెస్ క్రీమ్ల ప్రకటనల్లో నటిస్తూ వాటిని ఆమోదిస్తారు. అలాగే కొంత మంది ప్రముఖులు కలరిజానికి వ్యతిరేకంగా నోరు విప్పారు. ప్రముఖ బాలీవుడ్ తారలైన దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, దిషా పటాని, సోనమ్ కపూర్ సోషల్ మీడిమాలో బ్లాక్ లైవ్స్ మాటర్ ఉద్యమానికి మద్దతిచ్చారు. వీరి ప్రయత్నం ప్రశంసనీయం. అయితే తారలు ఫెయిర్నెస్ క్రీములను ఆమోదించడం పట్ల చాలా మంది నవ్వుకుంటున్నారు. లక్షలాది మంది భారతీయులు వాళ్ళ వైపు చూస్తుంటారు. వాళ్ళు ఆమోదించిన క్రీములను ఉపయోగించాలని వారు కోరుతున్నారు.
చిన్న వయసు నుండే
క్లినికల్ సైకాలజిస్ట్ రాధిక బాపాట్ మాట్లాడుతూ ''తెల్లటి చర్మం అనే భావన చాలా చిన్న వయసులోనే అమ్మాయిల మనస్సులో నాటుకుపోతుంది. మీడియానే దీనికి ప్రధాన కారణం. అమ్మాయిలు ఆడుకునే బొమ్మల దగ్గర నుండి అన్నీ తెల్లగా ఉండాలి. శరీర పరిమాణం, ఆకారం, రంగు ప్రాముఖ్యత చిన్న పిల్లల్లో ఉండిపోతుంది. వయసుతో పాటు ఆ భావన కూడా పెరిగిపోతుంది. వాళ్ళు రోల్ మోడల్స్గా భావించే వారి ప్రకటనలు మరింతగా ప్రోత్సహిస్తున్నాయి. దాంతో చిన్నతనం నుండే శరీర అసంతృప్తి, నిరాశ, ఆత్మన్యూనతకు గురౌతున్నారు'' అన్నారు.
ఎప్పుడో జరగాల్సింది
ఇన్స్టాగ్రామ్లో లక్షలాదిగా ఫాలోవర్స్ కలిగిన బ్యూటీ వ్లాగర్, శ్రద్ధా గురుంగ్ దీని గురించి ఏమంటారంటే... ''చర్మం రంగు ఆధారంగా మనిషిని అంచనా వేయడం అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇది పూర్తిగా వ్యక్తిగతమైనది, మన పుట్టుకకు సంబంధించినది. అందుకే ఫెయిర్ అండ్ లవ్లీ వంటి బ్రాండ్లను నేను విమర్శిస్తున్నాను. ఫెయిర్ అనే పదాన్ని తొలగించడం చాలా అవసరం. అసలు ఇది చాలా కాలం కిందటే జరిగి ఉండాలి.
అమ్మతో గొడవపడేదాన్ని
ఫెయిర్ అండ్ లవ్లీ ఒక అసలైన అపరాధి అని ముంబైలోని జేవియర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్లో, మర్కెటింగ్ కమ్యూనికేషన్, రచయిత, విద్యార్థి కబ్యాశ్రీ దాస్గుప్తా(23) అంటున్నారు. ''ఫెయిర్ అండ్ లవ్లీతో అందమైన చర్మం వస్తుంది అనే భావన నాకు ఏడెనిమిది ఏండ్ల వయసులోనే మొదలయింది. అప్పట్లో టీవీ ప్రకటన చూసి ప్రభావితమయ్యాను. ఆ ప్రకటన నన్ను ఎంతో ఆకర్షించింది. అది చూసిన తర్వాత నా సహజ రంగు నాకు నచ్చలేదు. నా తల్లి తెల్లగా, నాన్న గోధుమ రంగులో ఉంటారు. నేను మాత్రం నల్లగా పుట్టాను. నేను చీకటిలో వున్నాను అనుకునేదాన్ని. ఇలా పుట్టినందుకు నన్ను నేను తిట్టుకునేదాన్ని. నన్నెందుకు ఇలా కన్నావు అని మా అమ్మతో గొడవపడేదాన్ని. వయసు పెరిగే కొద్ది కొంత అర్థం చేసుకున్నాను. నా రంగును నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టాను. ఇది నా ప్రయాణంలో నేను నేర్చుకున్న విషయం. ఒక మహిళ జీవితంలో చర్మం రంగు ఎంతో ప్రభా వాన్ని చూపుతుంది. అందుకే నేను క్రీమ్ను తీవ్రంగా విమర్శిస్తు న్నాను'' అంటారామె.
వివాహ సమయంలో...
23 ఏండ్ల మిగ్మార్ లామో చదువుకునే రోజుల్లో పాఠశాలలో అందరూ తనని 'నల్లజాతి మహిళ', 'కాలి మా' అని పిలువడాన్ని గుర్తు చేసుకుంది. వెర్త్బాక్స్ వ్యవస్థాపకురాలు శ్రేయా కొఠారి (27), సమాజం ఒక వ్యక్తిని చర్మం రంగు ఆధారంగా 'కాలీ' అని పిలవడం సరైనది కాదు. ఈ వివక్షను నేను నా స్నేహితురాలి జీవితంలో దగ్గరగా చూశాను. ఆమెకు పెండ్లి సంబంధాలు చూసే సమయంలో తెల్లగా మారేందుకు ట్రీట్మెట్ తీసుకోమని ఒత్తిడి చేసేవారు.
బ్లాకీ అని పిలిచేవారు
ముంబయికి చెందిన 22 ఏండ్ల వైద్య విద్యార్థిని కాథ్లీన్ మాథ్యూ ''నన్ను ఎవ్వరూ నా పేరుతో పిలిచేవారు కాదు. నా మేనమామ మీ అబ్బాయి ఇంత నల్లగా ఉంది నా తల్లిదండ్రుల దగ్గర ఎగతాళిగా మాట్లాడేవాడు. పాఠశాల, కళాశాలలో కూడా నా ముదురు చర్మం చూసి 'అయే డార్క్', 'బ్లాకీ' అని పిలిచేవారు. కెనడాకు వెళ్ళిన తర్వాత నేను నల్ల రంగు కలిగిన భారతీయురాలిని కావడంతో జాతి వివక్షకు గురయ్యాను. నా మాజీ ప్రియుడు కూడా నాలాగే ఉండేవాడు. మీరు చాలా నల్లగా ఉన్నారు. చీకటిని మేము చూడలేము అనేవారు'' అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.
మార్పు రావాల్సిందే
ది బ్లాక్ లైవ్స్ మాటర్ ఉద్యమంపై అవగాహన నెమ్మదిగా ఉన్పటికీ సమాజాన్ని ఇది ఎంతో కొంత కచ్చితంగా మారుస్తోంది. చాలామంది సెలబ్రిటీలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
శరీర అనుకూలత వైపు
మన దేశంలో శరీరక ఆకృతిపై ఆత్మగౌరవం ముడిపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన శరీరాన్ని మనం గౌరవించుకునే విధంగా అవగాహన కలిగి వుండడం అమ్మాయిలకు చాలా అవసరమని రాధిక బాపాట్ అంటున్నారు. ''దీనిపై చిన్న వయసులోనే తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలి. అందం, తెలుపు చర్మంపై ఇంట్లో, పార్టీలలో, వివాహాలలో జరిగే సంభాషణలు నిలిపివేయాలి. 'మీరు ఎంత బరువు కోల్పోయారు, ఎంత సంపాదించారు' ఇదే జీవితాన్ని నమూనాలు కావు. ఇవే ప్రభావాలు పిల్లలపై పడతాయి. ఈ విషయంలో మీడియా కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందతి. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు అలాంటి ప్రభావాలకు లోనుకాకుండా అప్రయత్తంగా వుండాలి'' అంటున్నారు.
విద్యార్థి దశ నుండే అవగాహన
ఏది ఏమైనా క్రీమ్ పేరులో మార్పు చేసినంత మాత్రానా అందం పట్ల భారతదేశంలో ఉన్న మూస పద్ధతి పూర్తిగ కనుమరుగువుతుందనే నమ్మకం లేదు. ఎందుకంటే ఇది నరనరాల్లో జీర్ణించుకు పోయిన ఓ భావన. అయితే రంగు వాదానికి వ్యతిరేకంగా ఉద్యమం వేంగా పుంజుకుం టుంది. ఏదేమైనా ''మీరు నలుపు లేదా తెలుపు అనే విషయంలో పట్టింపు లేదు'' అనేది విద్యార్థి దశ నుండి ప్రారంభమైతేనే మార్పు వస్తుంది.
సరైన అడుగు
పేరు మార్చడం చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. ఇది సరైన దిశలో వేస్తున్న ఒక అడుగు. రంగు ఆధారంగా జరుగుతున్న వివక్ష గురించి నటులు చాలా సందర్భాలలో తమ గొంతు వినిపిస్తూనే వున్నారు.
- నందితా దాస్
తిరస్కరించారు
తాప్సీ మహిళల హక్కులను కాలరాసే ప్రచారం చేసే ఈవెంట్ నుండి వైదొలుతున్నట్టు ప్రకటించారు. సౌత్ స్టార్ సాయి పల్లవి కూడా ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటనను తిరస్కరించారు. గాయిని సోనా మెహపాత్రా కూడా రంగు ఆధారంగా చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా పదేపదే మాట్లాడారు. ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ షాదీ.కామ్ కూడా దాని స్కిన్ టోన్ ఫిల్టర్ను తొలగించింది.