Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజులు మారిపోయాయి. మహిళలు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. రాత్రిపూట కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. సాధికారత పరంగా ఇది సంతోషకరమే అయినా ఆరోగ్యపరంగా మాత్రం ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. ఆడవాళ్లు నైట్ డ్యూటీస్ చేయకపోవడమే మంచిది అంటున్నారు. పగలు ఉద్యోగాలు చేసేవారికంటే రాత్రిళ్లు ఉద్యోగాలు చేసే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నట్లు ఓ పరిశోధనలో తేలడమే దానికి కారణం.
మామూలు వెలుతురులో కాకుండా లైట్ల కాంతిలో పని చేస్తే మెదడులో విడుదలయ్యే మెలటోనిన్ విడుదల కాదట. ఈ హార్మోన్... రొమ్ము, అండాశయ క్యాన్సర్లను ప్రేరేపించే ఈస్ట్రోజన్ మోతాదు పెరగకుండా చూసుకుంటుందట. అయితే మెలటోనిన్ మధ్యరాత్రిలో బాగా ఉత్పత్తి అవుతుందట. అది కూడా చీకటిగా ఉన్నప్పుడు. అలాంటి సమయంలో కత్రిమ వెలుగులో పని చేయడం వల్ల ఉత్పత్తి ఆగిపోతుందట. తద్వారా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందన్న మాట.
అది మాత్రమే కాదు... నైట్ డ్యూటీలు చేసే మహిళలకు పుట్టే పిల్లలు కూడా అంత ఆరోగ్యంగా ఉండటం లేదని విదేశాల్లో జరిగిన కొన్ని పరిశోధనల్లో తేలిందట. దానితో పాటు పేగుల సమస్యలు, జీర్ణక్రియ దెబ్బ తినడం వంటి మరికొన్ని సమస్యలు కూడా వచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయం మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ... ఇంతవరకూ జరిపిన పరిశోధనల ఫలితాల దష్ట్యా మహిళలు రాత్రిపూట ఉద్యోగాలు చేయకపోవడమే మంచిదటున్నారు నిపుణులు.