Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజారోగ్యవ్యవస్థ ఏ మేరకు బలోపేతంగా ఉందనే విషయం కరోనా తెలిపింది. ఇంతకాలం వాపును చూసుకుని బలమనుకున్న చోట ఉన్న డొల్లతనం బయటపెట్టింది. వెక్కిరిస్తున్న ఖాళీ పోస్టులు, పెరుగుతున్న రోగులతో సతమతమవుతున్న ఆస్పత్రుల్లో పనిభారంతో సిబ్బంది పడే ఇబ్బందులు వెలుగులోకి తెచ్చింది. ఎంతోకాలంగా ఆగిన నియామక ప్రక్రియను మొదలు పెట్టించింది. కరోనాతో జనం ఆందోళనకు గురవుతున్న సమయంలో వరసగా పడుతున్న నియామకాలతో వైద్య, నర్సింగ్, పారామెడికల్ నిరుద్యోగులు మాత్రం మంచి జరిగిందని సంతోషిస్తున్నారు. ఎంతో కాలం నుంచి ప్రజాసంఘాలు, ఇతరులు నెత్తి, నోరు మొత్తుకుంటున్నా పట్టించుకున్న పాపానా పోలేదు. కోర్టు కేసుల పేరుతో ఆగిన వాటికి కూడా మోక్షం కలగడంతో ఇప్పటికైనా సరిపడిన సిబ్బంది వస్తారని ఆశిస్తున్నారు. నిరుద్యోగులతో పాటు పనిభారం పెరిగిన సిబ్బంది కూడా కొత్త నియామకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏమేరకు ఆచరణలో నిజమౌతుందో వేచిచూడాలి.
-కొత్తూరు ప్రియకుమార్