Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే సామాన్య ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి సాధారణ ఎన్నికల్లో గెలవటం ఒక ఎత్తు. విద్యావంతులు అలాంటి ప్రలోభాలకు లొంగిపోతారా!? విద్యావంతులు, విద్యార్థులు ఆచితూచి ఆలోచించి చైతన్యంతో ఓటు వేస్తారని నమ్మకం. కాబట్టి ఈ ఎన్నికలు రసవత్తరం. ముఖ్యంగా విద్యావంతులైన నిరుద్యోగులు, యూనివర్సిటీ విద్యార్థులు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతలో ఉన్నారు. కనుక ఇప్పుడు అధికార పార్టీకి ఈ ఎన్నికలు కత్తిమీద సవాలు. ఈ ఎన్నికలతో పాటు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఏలినవారికి ఇబ్బందే. ఓటర్లను ఎక్కువశాతం చేర్పించే పనిలో పార్టీలు నిమగమైనాయి. టీఆర్ఎస్ను ఢకొీట్టడానికి పొత్తులు, చర్చలు కూడా సాగుతున్నాయి. పోటీలో మేధావులే ఎక్కువగా ఉన్నారు. మరి ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారో వేచిచూడాల్సిందే. వివేకంతో ఓటేసి ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగించాల్సిన బాధ్యతను విద్యావంతులు గుర్తించాలి. ఓటు అంగడి సరుకు కాదని నిరూపించాలి.
-అయినం రఘురామారావు, ఖమ్మం.