Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాళీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వేస్తారన్న ప్రకటన నిరుద్యోగుల్లో ఎంత సంతోషం ఇచ్చిందో కాని కోచింగ్ సెంటర్లకు మాత్రం అమితుత్సాహాన్ని కలిగించింది. వైద్యారోగ్యశాఖలో పెద్ద ఎత్తున ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారని భావిస్తున్న నేపథ్యంలో అప్పుడే నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక ఆన్లైన్ శిక్షణ అంటూ కొంత మంది ప్రచారం మొదలు పెట్టారు. ఏండ్ల తరబడి పోస్టుల భర్తీ లేకపోవడంతో ఇప్పటికే నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర వైద్య కోర్సులను అభ్యర్థించిన నిరుద్యోగులు వేల సంఖ్యలో ఉన్నారు. మరోవైపు కరోనా, లాక్డౌన్ దెబ్బతో మూతబడిన కోచింగ్ సెంటర్లు అప్పుడే ఆన్లైన్లో అద్భుతమైన కోచింగ్ అంటూ ఊదర గొడుతున్నాయి. ఉద్యోగాల సంగతేమోగానీ ఇప్పటికే విద్యనభ్య సించేందుకు ఎంతో వ్యయ ప్రయాసాలకోర్చే పేద విద్యార్థులకు ప్రభుత్వం తరపున శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు తల్లిదండ్రులు. ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి.
- కె.ప్రియకుమార్