Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా దెబ్బకు గత ఏడాదంతా భయం గుప్పిట్లోనే సాగిపోయింది. జాగ్రత్తలు, అప్రమత్తత తప్పకపోవడంతో శానిటైజర్, సబ్బులు, భౌతిక దూరం అంటూ రాసుకుంటూ, పూసుకుంటూనే కాలం గడిచిపోయింది. లాక్డౌన్తో నెలల తరబడి కోట్లాది మంది ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. కేసులు తగ్గుముఖం పడుతున్నాయనీ, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్నదన్న వార్తలు నూతన ఏడాదిలోకి సంతోషంగా తీసుకెళ్తాయని భావించారు. అప్పుడే సంబరం తీరలేదని కరోనా మ్యుటేషన్ అయిన కరోనా స్ట్రెయిన్ రూపంలో కేసులు వెలుగు చూస్తుండడంతో కొత్త ఏడాది ప్రారంభంలోనూ ఇంకా భయం వెన్నాడుతూనే ఉన్నది. కరోనాలా కాకుండా స్ట్రెయిన్ విషయంలో ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తే 2021 ఏడాది కోరుకున్నట్టు ఉండే అవకాశముంది. అలా ఉండాలని ఆశిద్దాం...
- కె.ప్రియకుమార్