Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలా అనగానే అదేదో వేలంపాట అనుకొనేరు...కానే కాదు. కచ్చితంగా సర్కారుకు వంత 'పాటే'...కాకపోతే ఏ రాగంలో మొదలెట్టాలో...ఏ శృతిలో ముగించాలో అర్థంకాక అధికారపార్టీ నాయక, కార్యకర్తలు బుర్రలు గోక్కుంటున్నారు. సీఎం కేసీఆర్ నిన్న మొన్నటి వరకు కేంద్రంతో యుద్ధమే అంటూ 'ఉత్తర' ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లులపై ఆసెంబ్లీ వేదికగానే ఆయన ఉపన్యాసాలు దంచారు. అప్పటి వరకు దాన్నే ప్రామాణికంగా తీసుకొని, కేంద్ర అధికారపార్టీ బీజేపీపై టీఆర్ఎస్ నాయక, కార్యకర్తలు దుమ్మెత్తి పోసారు. ఆదే జోష్లో భారత్బంద్లో రోడ్లెక్కి నినాదాల పేరుతో పెడబొబ్బలూ పెట్టారు...కానీ సీఎం కేసీఆర్ సాబ్ ఢిల్లీ వెళ్లొచ్చాక, రూటు మారడంతో ఇప్పుడేం చెప్పాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. యూ టర్న్ సీఎం అని స్వయానా బీజేపీ నేతలే రివర్స్లో దుమ్మెత్తి పోస్తుంటే...టీఆర్ఎస్ నాయక, కార్యకర్తలు దులుపుకోలేక తిప్పలు పడుతూ, చేతులడ్డంపెట్టి వెనక్కి పరిగెడుతున్నారు. ఇదేం గోలరా బై...పెద్దోళ్లు సప్పుడు సేస్తలేరు...ఏం సెప్పాల్నో సమజైతలేదు...అంటూ గోళ్లతో రక్తం కారేలా బుర్రలు గోక్కుంటున్నారు. గల్లీలో కుస్తీ...ఢిల్లీలో దోస్తీ అంటే ఇదే బై అంటూ వాళ్లమీద వాళ్లే సెటైర్లు వేసుకుంటున్నారు. ప్చ్...ఏం చేస్తాం...ఓ విధానం అంటూ లేని ప్రాంతీయ పార్టీల నుంచి అంతకు మించి ఏం ఆశిస్తాం!
- ఎస్ఎస్ఆర్ శాస్త్రి