Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఏం మాట్లాడుతున్నావ్? అల్లం అంటే నాకు తెలీదా? బెల్లంలా పుల్లగా ఉంటది! గది గిట్ట తెల్వదా?'' అని ఎన్కట ఎవడో వాదించిండంట. అదిగాదురయ్యా! బెల్లం తింటే తియ్యగుంటది. అల్లం తింటే నోరు మండుతదిరయ్య అని నచ్చజెప్ప చూస్తే 'తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు' అన్న చందంగా తనదే కరక్టు అన్నట్టు మొండిగా వాదించిండంట. ఎంత నచ్చజెప్పాలని చూసినా తాను చెప్పేదే నిజమని వాగిండంట. కాదన్నోళ్లందర్నీ తిట్టడం, బెదిరించడం చేసిండంట. ఇగో గీ ముచ్చట లెక్కనే ఉంది వాట్సాప్ వర్సిటీ సోదరుల సోది. ''దేశ సంపదను ప్రయివేటు శక్తులకు కట్టబెట్టొద్దు... రక్షణ రంగంలోకి విదేశీ పెట్టుబడులను తేవొద్దు... పరిశ్రమలను అమ్మొద్దు... బంగారు బాతుగుడ్డు లాంటి ఎల్ఐసీని నిర్వీర్యం చేయొద్దు...'' అని ఎవరైనా అన్నారంటే చాలు... మోడీ భజనపరులకు ఒంటికాలిమీద లేసేటంత కోప మొస్తున్నది. సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా మంచేదో? చెడోదో? విశ్లేషించడం ప్రజాస్వామిక పద్ధతి. కానీ, వాట్యాప్ వర్సిటీకి చెందిన భక్తులకు మోడీని ఏమైనా అంటే అస్సలు గిట్టట్లేదు. చర్చపెడితే వింతండ వాదాలు చేసి మరీ సారే గొప్ప అంటూ భుజాలు ఎగిరేస్తున్నరు. అవినీతిపై చర్చపెడితే... తిననోడు ఎవడు? దేశ సంపదను అమ్మనోడు ఎవడు? అంటూ వితండ వాదనలు చేస్తున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే సోషల్మీడియా వేదికగా తిట్లపురాణం పెడుతున్నరు. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్లు సైతం ఛీ..ఛీ..ఈ కంపు మాకొద్దురయ్యా అని పక్కకు తప్పు కునేలా చేస్తున్న దౌర్భాగ్య స్థితి నేడు నెలకొంది.
- అచ్చిన ప్రశాంత్