Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలోని 30 అతి కాలుష్యనగరాల జాబితాలో భారత్కు చెందిన 22 మహానగరాలు ఉండడం అత్యంత విచారకరం. ప్రపంచ వ్యాప్తంగా ఇండియా 3వ అతి కాలుష్య దేశంగా, దేశ రాజధానుల్లో మన న్యూఢిల్లీ అత్యంత కాలుష్య రాజధానిగా నిలిచింది. ప్రపంచ నగరాల్లో న్యూఢిల్లీ 10వ అతి కాలుష్య నగరంగా నిలవడం జరిగిందని స్విస్కు చెందిన ఐక్యూ ఏయిర్ సంస్థ తాజాగా మంగళవారం మార్చి 16న విడుదల చేసిన 'వరల్డ్ ఏయిర్ క్వాలిటీ రిపోర్ట్-2020' నివేదిక వివరాలు తెలియజేస్తున్నాయి. 2019తో పోల్చితే 2020లో న్యూఢిల్లీ నగరంలో గాలి నాణ్యత 15శాతం పెరగడం కొంత ఊరటను ఇస్తున్న అంశంగా చెప్పవచ్చు. 30 అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత్కు చెందిన 22 నగరాలు ఉండడం ప్రమాద హెచ్చరికలు చేస్తున్నది. ప్రపంచంలోని 106 దేశాలకు చెందిన నగరాల గాలిలోని సూక్ష్మ ధూళి కణాల వివరాలను పియం2.5 కొలమానాల ఆధారంగా నిర్థారించడం జరిగింది. కరోనా కల్లోల లాక్డౌన్ ఫలితంగా మానవాళి జీవన విధానంలో పెను మార్పులు రావడంతో నగర కాలుష్యం తగ్గడం జరిగిందని నివేదిక తెలిపింది.
భారత నగరాల్లో రవాణా వ్యవస్థ, బయోమాస్ను కాల్చడం, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, నిర్మాణరంగం, వ్యర్థాలను కాల్చడం, వ్యవసాయ వ్యర్థాలను కాల్చి వేయడం వంటి కారణాలతో నగరాలు కాలుష్య నరక కూపాలుగా మారుతున్నాయి. సూక్ష్మ ధూళి కణాల పియం2.5 కాలుష్యానికి ప్రధాన కారణంగా నగరాల్లో రవాణా వాహనాలు వెదజల్లే శిలాజ ఇంధనాల దహన పొగలు నిలుస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా చైనాలోని జిన్జియాంగ్ (హౌట్టన్) పట్టణం నిలిచింది. ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో తరువాత 13 స్థానాలలో ఇండియాకు చెందిన గాజియాబాద్ (2వ స్థానం), బులంద్ షహర్, బిస్రక్ జలాల్పూర్, బివండీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, కాన్పూర్, లక్నో, ఢిల్లీ, ఫరీదాబాద్, మీరట్, జింద్, హిస్సార్ (14వ స్థానం)లు నిలిచాయి. అత్యంత కాలుష్య ప్రపంచ 50 నగరాల్లో 35, 100 ప్రపంచ నగరాల్లో ఇండియాకు చెందిన 46 నగరాలు ఉండడం కాలుష్య సమస్య గంభీరతను తెలియజేస్తున్నాయి. ఇండియాకు చెందిన నగరాల్లో మాత్రమే పోల్చితే తెలుగు రాష్ట్రాలకు చెందిన విశాఖపట్టణం (75వ స్థానం), హైదరాబాద్ (86వ స్థానం), తిరుపతి (106వ స్థానం) మహానగరాలు జాబితా చివరలో ఉండటం సంతోషంగా తోస్తున్నది. కరోనా కారణంగా నగరాల్లో తగ్గిన కాలుష్యం తిరిగి 2021లో పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. భారత్కు చెందిన 63శాతం నగరాల్లో 2019తో పోల్చితే 2020లో గాలి కాలుష్యం తగ్గడం గమనించారు. గాలి కాలుష్యంతో ఆర్థిక నష్టాలు, అనారోగ్యాలు, గర్భస్రావ ప్రమాదాలు కనిపిస్తాయని మరువరాదు. దక్షిణ ఆసియా ప్రాంత ఇండియా, బంగ్లాదేశ్ మరియు పాకిస్థాన్లలో కాలుష్యం గరిష్టంగా నమోదు కావడం జరిగింది. న్యూఢిల్లీ నగరంలో పియం2.5 సూక్ష్మ ధూళి కణాలకు సంబంధించిన గాలి కాలుష్యంతో 2020లో అత్యధికంగా 54,000 మరణాలు జరిగాయని, ప్రతి మిలియన్ జనాభాలో 1,800 మరణాలు నమోదు అవుతున్నాయని నిర్థారించారు. గాలి కాలుష్యంతో ముంబారులో 25,000, బెంగుళూరులో 12,000, చెనైలో 11,000, హైదరాబాద్లో 11,000, లక్నోలో 6,700 మరణించారని తేలింది. ఆధునిక నవ్యతరం పోకడలు కాలుష్య హేతువులుగా మారుతున్న ప్రమాదకర వేళ అభివద్ధి, పర్యావరణ పరిరక్షణల మధ్య సమతుల్యత సాధిస్తూ, ఆరోగ్య సౌభాగ్య భారతాన్ని ఆవిష్కరిద్దాం.
- డా||బి.ఎం.రెడ్డి
సెల్:9949700037