Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంధించిన రుగ్మతగా 'హీమో ఫిలియా'ను గుర్తిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 5లక్షల మంది హీమోఫిలియాతో బాధ పడుతున్నారని అంచనా. హీమోఫిలియా రుగ్మతతో బాధ పడే వ్యక్తులకు కోవిడ్-19 వ్యాధి పెద్ద సమస్యగా మారింది. సమాజంలో హీమోఫిలియా, ఇతర సంబంధిత వారసత్వ వ్యాధుల పట్ల సంపూర్ణ అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ప్రతి ఏటా ఏప్రిల్ 17న 'ప్రపంచ హీమోఫిలియా దినం' నిర్వహిస్తారు. ప్రపంచ హీమోఫిలియా దినం-2021 నినాదంగా 'మార్పుకు అనుగుణంగా: నూతన సంవత్సరంలో సంరక్షణను కొనసాగించడం' అనే సారాంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం జరుగుతోంది. 1969లో 'ప్రపంచ హీమోఫిలియా ఫెడరేషన్' సంస్థను స్థాపించిన 'ఫ్రాంక్ స్నాబెల్' పుట్టిన రోజు 17 ఏప్రిల్ సందర్భంగా ప్రపంచ హీమోఫిలియా దినాన్ని 1989 నుంచి పాటించుట ఆరంభమైంది. హీమోఫిలియా రుగ్మత చికిత్సలో రక్త మార్పిడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. హీమోఫిలియా రుగ్మత ఉన్నట్లు చాలా మందికి తెలియదు. కాబట్టి దీని పట్ల అవగాహన, వైద్య చికిత్సలు, తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకొని ఉండడం మంచిది.
వైవిధ్యభరిత సమాజంలో కుటుంబాలు, పౌర సమాజం, సంరక్షకులు, ఫిజీషియన్స్, పరిశోధకులు అందరూ కరోనా కోరల్లో చిక్కడంతో హీమోఫిలియా రుగ్మతలతో పాటు ఇతర అనారోగ్యాలతో బాధ పడే రోగుల వైద్యం నేడు ప్రమాదంలో పడింది. హీమోఫిలియా రుగ్మతలకు కరోనా మహమ్మారి పెద్ద సవాలుగా నిలిచినా, 'అందరికీ వైద్యం' అనే సంకల్పంతో ముందుకు సాగడం జరుగుతున్నది. హీమోఫిలియా రుగ్మతతో బాధపడే వ్యక్తులకు చిన్న గాయం ఏర్పడినా రక్తం గడ్డకట్టడం మందగించి రక్తస్రావం కొనసాగి ప్రాణాపాయానికి దారి తీస్తుంది. రక్తం గడ్డకట్టే విధానాన్ని ఆధారంగా చేసుకొని హీమోఫిలియా రుగ్మత రెండు రకాలుగా ఉంటుంది. వీటినే హీమఫిలియా-ఏ మరియు హీమోఫిలియా-బి అని పిలుస్తారు. అధికంగా కనిపించే హీమోఫిలియా-ఏ రుగ్మత దాదాపు ప్రతి 5,000లలో ఒకరికి మరియు హీమోఫిలియా-బి రుగ్మత దాదాపు ప్రతి 20,000లో ఒకరికి వస్తుందని గమనించారు. హీమోఫిలియా, ఇతర రక్త సంబంధ వ్యాధులతో బాధ పడుతున్న 80శాతం మందికి ఈ వ్యాధి ఉందని ఏమాత్రం తెలియదు.
అనువంశికంగా సంక్రమించే హీమోఫిలియా వల్ల వ్యక్తికి గాయం అయినపుడు వెంటనే రక్తం గడ్డకట్టడం జరుగదు. దీని ఫలితంగా చిన్న, పెద్ద గాయానికి రక్తస్రావం అధికంగా జరిగి, ప్రమాదకరమైన దుస్థితి వస్తుంది. కొన్ని సందర్భాలలో అంతర్గత రక్తస్రావ సందర్భంగా మెదడు, కీళ్ళలో రక్తస్రావం జరిగి ప్రాణాలు కూడా పోవచ్చు. హీమోఫిలియా రుగ్మత అంటువ్యాధి కాదు. కొందరిలో హీమోఫిలియా వలన రక్తస్రావం వారాలుగా కొనసాగవచ్చు. కీళ్ళు, కండరాల్లో రక్తస్రావం జరిగితే కీళ్ళ వాపు, కండరాల నొప్పి కనిపిస్తాయి. హీమోఫిలియా రుగ్మత అవగాహన నిమిత్తం లోగోలు, నినాదాలు, ఇతర కార్యక్రమాలు, కరపత్రాలు, ప్రచార సామాగ్రి, విద్యాలయాల్లో పోటీలు, సామాజిక మాద్యమాల్లో దశ్య శ్రవణ ప్రచారాలు పెద్ద ఎత్తున నిర్వహించాలి. జన్యులోపాలతో అనువంశికంగా సంక్రమించే హీమోఫిలియాకు ఎలాంటి సరైన చికిత్స అందుబాటులో లేదు. దీనిని నివారించుట కూడా సాధ్యపడదు.
భారతదేశంలో దాదాపు 2 లక్షల హీమోఫిలియా రోగులు ఉన్నారని, వీరిలో 20,000 మంది మాత్రమే నమోదు చేయబడినారని తెలుస్తున్నది. ప్రతి లక్ష మందిలో నలుగురికి హీమోఫిలియా రుగ్మత కనిపిస్తున్నది. హీమోఫిలియా రుగ్మతను గుర్తించే పరీక్షలు ఏపిటిటి, పిటిలు ఉన్నాయి. రుగ్మత ఉందని తెలియని వారికి గాయాలు అయినపుడు అధిక రక్తస్రావం జరిగి ప్రమాదకరంగా మారుతున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు హీమోఫిలియా రుగ్మత ఓ శాపంగా మారుతున్నది. హీమోఫిలియా ఉందని తెలియని కారణంగా అంతర్గత, బాహ్య గాయాలు తగిలినపుడు రక్తం గడ్డ కట్టకపోవడంలో అనేక తీవ్ర సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ప్రతి 5,000 మంది శిశువుల్లో ఒకరికి హీమోఫిలియా రుగ్మత ఉండవచ్చని అంచనా. తల్లిలో జన్యువులు మార్పు (మ్యుటేషన్) చెందడంతో పిల్లల్లోకి ఆ జన్యువులు చేరి, హీమోఫిలియా తల్లి నుంచి అనువంశికంగా శిశువుకు సంక్రమిస్తుంది. హీమోఫిలియా లాంటి నిశ్శబ్ద రుగ్మతను త్వరగా గుర్తించడం, తగు జాగ్రత్తలు తీసుకోవడం, అందరికీ అవగాహన కల్పించడం లాంటి చర్యలతో ప్రాణహానిని తప్పించే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
- డా||బి.ఎం.రెడ్డి
సెల్:9949700037