Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ పాత్రికేయు రాలు గౌరీ లంకేష్ హత్యతో భావప్రకటన స్వేచ్ఛ హక్కుపై మరోసారి దారుణంగా దాడి జరిగింది. స్వతంత్ర భారతా వనిలో ఆర్టికల్ 19 (1) ప్రాథ మిక హక్కుల రూపంలో భావ ప్రకటన హక్కును రాజ్యాంగ కర్తలు మనకు అందిస్తే ఆ హక్కులను అప్రజాస్వామి కంగా దేశంలో ఎక్కడో ఓ చోట దారుణంగా హత్యగావించబ డుతున్నది. ప్రజాస్వామ్య గొంతును నులిపే శక్తులు పెచ్చుమీరుతున్నా ప్రభుత్వాలు చోద్యం చూస్తుండటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ప్రభుత్వాలే రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించివేసే సంఘటనలు చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకం గా ప్రజల గొంతుకలై వస్తున్న అక్షరాలపై నియంతత్వ పొకడలతో కర్య్ఫూ విధిస్తున్నారు. 'పత్రికలను పాతాలంలోకి తొక్కేస్తాం, ఈ రాతలు రాసేవారు ఈ రాష్టానికి అవసరమా' అని సాక్షాత్తు పాలకులు అంటే, భావ ప్రకటన స్వేచ్ఛ పాలకుల కాళ్ల కింద ఉండాలా? ప్రజల పక్షం వహించాల్సిన అక్షరం పాలకుల భజనలో ఉండాలా?
దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిజాలు రాసిన జర్నలిస్టులు హత్యలకు గురవుతున్న ఉదంతాలు పెక్కు. వాటిలో సత్వర న్యాయం జరిగిన సంఘటనలు మచ్చుకైనా కానరావడం లేదు. రచయితలను హత్య చేయడం, భావప్రకటన స్వేచ్ఛకు భావసారుప్యత ఉన్న పలు సందర్భాలలో జర్నలిస్టులు, రచయితలపై దాడులు జరగడం అమానుషం. భావసారుప్యత ఉంటే ప్రజాస్వామ్యబద్దంగా న్యాయస్థానాల ను ఆశ్రయించవచ్చు. కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి హత్యలు చేయడం అమానుషం. భావప్రకటన స్వేచ్ఛపై దాడులు చేయడం, నిజాలు నిర్భయంగా రాస్తే బెదిరింపులు, హత్యలు చేయడం పరిపాటిగా మారింది. ఈ హత్యల వల్ల అక్షరాలు భయపడిపోతాయని అనుకోవడం కల్ల. ఎక్కడైతే భావప్రకటన స్వేచ్ఛగొంతు నొక్కబడుతుందో అక్కడ వేల గొంతుకలై గళం విప్పడానికి ప్రజాస్వామ్యవాదులు సిద్ధంగా ఉంటారు. ఎంతమంది గొంతులు మీరు నొక్కగలరు?
మన దేశంలో బ్రిటిష్ నిరంకుశత్వాన్ని ఎదిరించడానికి పత్రికలు పుట్టాయి. ఆ కాలంలో పాత్రికేయ వత్తి స్వాతంత్య్ర పోరాటంలో భాగంగానే కొనసాగింది. ఎందరో సంపాదకులు, పాత్రికేయులు ఆనాటి బ్రిటిష్ నిరంకుశపాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పత్రికలపై ఆంక్షలు, నిషేధాలు, పాత్రికేయులపై దాడులు, జైలుశిక్షలు, హత్యలకు సైతం గురయ్యారు. వెర్నకులర్ ప్రెస్ యాక్ట్ 1878, 1908, 1910 ప్రెస్ యాక్ట్, 1930 ఆర్డినెన్స్ పత్రికలపై ఉక్కుపాదం మోపాయి. ఇలాంటి చట్టాలను ఎదిరించి భారతావని దాస్య శంఖలాలను తెంపడానికి అక్షరం గర్జించింది. నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ అక్షరయుద్ధం చేసి జైలు శిక్షలు అనుభవించిన పాత్రికేయులు, బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ సంపాదకీయాలు రాసి జైలుకు వెళ్తూ 'ఇంత త్వరలో నాకింతటి అదష్టం పట్టునా' అని సంతోషం వ్యక్తం చేసిన కాండ్రేగుల రామచంద్రరావు తెగువ, నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల దౌర్జన్యకాండను ఇమ్రోజ్ పత్రికలో విమర్శిస్తూ, రజాకార్ల చేతిలో చేతులు నరకబడి దారుణ హత్యకు గురైన షోయాబుల్లాఖాన్ మాకు ఆదర్శం. 'నేను అంతా ఒక పిడికెడు మట్టినే కావచ్చు కానీ కలం ఎత్తితే నాకు ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరుంది' అన్న గుంటూరు శేషేంద్ర శర్మ రచనలు, అక్షరాలను బంధిస్తే జైలు గోడల మీద అక్షరాలు దిద్దిన దాశరథి మాకు ఆదర్శం. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వాతంత్రం ఉపయోగించుకుని నిజాల్ని నిర్భయంగా, బాధితుల ఆర్తనాదాలకు అక్షర రూపం ఇచ్చి, అక్రమార్కుల సింహస్వప్నమైన నిఖర్సైన జర్నలిజం మా విలువలు. చివరాకరుగా 'వ్యక్తులను చంపడం సులభం కావచ్చు. సిద్ధాంతాలను మాత్రం సమాధి చేయలేరు. గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయినా సిద్ధాంతాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి' అన్న భగత్ సింగ్ మాటలే మాకు స్ఫూర్తి.
- వంగరి రవిరాజు
సెల్ : 9908170175